క్రిమిసంహారక మందు సేవించి వ్యక్తి మృతి

On
క్రిమిసంహారక మందు సేవించి వ్యక్తి మృతి

క్రిమిసంహారకమందు సేవించి వ్యక్తి వ్యక్తి మృతి చెందిన ఘటన వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన రూపని సత్తయ్య (56) వరి కోత మిషన్ కొనుగోలు చేసి నడిపిస్తూ జీవనం కొనసాగిస్తుంటాడు. వరి కోత మిషన్ కోసం శ్రీరామ్ ఫైనాన్స్ మోత్కూరు నందు రుణము పొంది బండి నడవకపోవడంతో సకాలంలో నెలవారికిస్తులు చెల్లించకపోవడంతో శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ వారు, వారి ఏజెంట్లు ఇతడిని వేధించి హార్వెస్టర్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనితో తీవ్ర మనస్తాపం చెందిన సత్తయ్య గురువారం రోజున గడ్డి మందు సేవించి హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రోజున మృతి చెందడం జరిగింది. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వలిగొండ ఎస్సై యుగేందర్ గౌడ్ తెలిపారు.IMG-20240914-WA0883

Views: 314

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి