చికిత్స పొందుతున్న దళిత మహిళ గోవిందమ్మను పరామర్శించిన- దళిత నాయకులు...

- దళితులపై జరుతున్న దాడులను అరికట్టాలి.

On
చికిత్స పొందుతున్న దళిత మహిళ గోవిందమ్మను పరామర్శించిన- దళిత నాయకులు...

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 14 :- కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో గురువారం రోజు రాత్రి సమయంలో దళిత మహిళపై మరో సామాజిక వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఆరు నెలల క్రితం దళిత మహిళ గోవిందమ్మ కుమారుడు ఈరన్న మరియు అదే గ్రామంలో రజక సామాజిక వర్గానికి చెందిన చాకలి నాగలమ్మ అను ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆరోజు నుండి రెండు కుటుంబాల మధ్య తీవ్ర మనస్పర్దాలు, గొడవలు ఏర్పడి యువతీ నాగలమ్మ కుటుంబ సభ్యులు కలిసి యువకుడు తల్లి గోవిందమ్మను కరెంట్ పోల్ కి కట్టి దారుణంగా చితకబాదారు.వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని దళిత మహిళ గోవిందమ్మను చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోవిందమ్మను శనివారం పెద్దకడుబూరు మండలంలోని వైసీపీ ఎస్సిసెల్ నాయకులు ముక్కరన్నా , అర్లప్ప మరియు ఎమ్మార్పిఎస్ నాయకులు యువరాజు ఆమెను పరామర్శించారు.అనంతరం వారు మాట్లాడుతూ దళిత మహిళపై ఇంతటి దాష్టికానికి పాల్పడిన అగ్రవర్ణాల నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళితులపై విచక్షణారహితంగా జరిగిన దాడి ఘటనపై వారు మండిపడ్డారు. దళితులపై జరుగుతున్న అగ్రవర్ణాల దాడులను అరికట్టాలని అధికారులను కోరారు.IMG_20240915_061202

Views: 95
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..