పొంగులేటి పై ఈడీ దాడులను ఖండిస్తున్నాం

బిజెపి కనుసందనలోనె దాడులు

On

కొత్తగూడెం క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం

IMG20240928123817కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 28: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ఆయన  కుటుంబంపై ఈడి దాడులను పూర్తిగా ఖండిస్తూ కొత్తగూడెం పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేస్తూన కాంగ్రెస్ ప్రభుత్వ 9 నెలల పాలనను జీర్ణించుకోలేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర పూరితంగా ఈడి దాడులు చేపిస్తుందని అన్నారు. నాలుగు రాష్ట్రాల్లో జరుగన్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం 2014 నుంచి 14 సంవత్సరాలుగా ఈడిని కక్ష పూరితంగా ఉసిగొల్పుతుంది అన్నారు. 25 సంవత్సరాలుగా ప్రముఖ కాంట్రాక్టర్ గా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారన్నారు. ఈ దాడులను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, కాంగ్రెస్ నాయకులు తుమూ చౌదరి, నాగేంద్ర త్రివేది, మేరెడ్డి జనార్దన్ రెడ్డి,మండే వీర హనుమంతరావు, తోట దేవి ప్రసన్న, పీతాంబరం,చీకటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Views: 204
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..