ఆదివాసి ప్రజలకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తాం

టేకులపల్లి సిఐ సురేష్, ఆళ్లపల్లి ఎస్సై రితీష్

On
ఆదివాసి ప్రజలకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తాం

ఆళ్లపల్లి పరిధిలో వైద్య శిబిరం

కొత్తగూడెం (న్యూస్ ఇండియా) నవంబర్7: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ  రోహిత్ రాజు ఆదేశాల మేరకు ఆళ్లపల్లి మండల పరిధిలోని బూస్రాయి గుత్తికోయ గ్రామాన్ని గురువారం  ఆళ్లపల్లి పోలీసులు సందర్శించారు. వలస ఆదివాసి ప్రజలు నివసిస్తున్న ఈ గ్రామంలో మలేరియా,డెంగ్యూ లాంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయని సమాచారాన్ని తెలుసుకొని అక్కడ వైద్య శిబిరాన్ని నిర్వహించారు.గ్రామంలోని ప్రజలకు పలు రకాల వైద్య పరీక్షలు చేయించి, ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగిందని టేకులపల్లి సిఐ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆయన మాట్లాడుతూ ఎవరైనా కొత్త వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు.వలస ఆదివాసీల సంక్షేమం,అభివృద్ధికి కోసం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  సారథ్యంలో ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటామని సూచించారు. వైద్య పరీక్షల అనంతరం కొంతమందిని తదుపరి పరీక్షల కోసం టేకులపల్లి రావాల్సింది కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆళ్లపల్లి ఎస్సై రితీష్ మరియు టి ఎస్ ఎస్ పి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Views: 8
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి