పాలకుర్తిలో ముగ్గురు అధికారులకు కలెక్టర్ మెమో జారీ

ఇంటింటి కుటుంబ సర్వే విధుల్లో నిర్లక్ష్యం

By Venkat
On
పాలకుర్తిలో ముగ్గురు అధికారులకు కలెక్టర్ మెమో జారీ

జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా

పాలకుర్తి మండలంలో ఇంటింటి కుటుంబ సర్వే విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో ముగ్గురు అధికారులకు జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మెమొలు జారీ చేయడం చర్చంశనీమైంది. ఈనెల 6న (బుధవారం) రోజున జిల్లా కలెక్టర్ పాలకుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇంటింటి కుటుంబ సర్వే పై పరిశీలనకు వచ్చారు. పాలకుర్తిలో ముగ్గురు పై కలెక్టర్ తీవ్రస్థాయిలో మండిపడ్డట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కారణంతో పాలకుర్తి ఎంపీడీవో ఆవుల రాములు, మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య, పాలకుర్తి పంచాయతీ కార్యదర్శి కె వెంకటేశ్వరచారి కి మెమో జారీ చేశారు. కలెక్టర్ జారీ చేసిన మెమోకు గురువారం రోజున వారు సంజాయిషీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియాల్సి ఉంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై జిల్లా కలెక్టర్ కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఉద్యోగుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి.IMG-20241101-WA0218

Views: 67
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
మహబూబాబాద్ జిల్లా:తొర్రూరు సెంటర్:మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13న (శుక్రవారం) భారీ జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. PM-USHA (RUSA) సౌజన్యంతో "AI (ఆర్టిఫిషియల్...
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన