పాలకుర్తిలో ముగ్గురు అధికారులకు కలెక్టర్ మెమో జారీ

ఇంటింటి కుటుంబ సర్వే విధుల్లో నిర్లక్ష్యం

By Venkat
On
పాలకుర్తిలో ముగ్గురు అధికారులకు కలెక్టర్ మెమో జారీ

జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా

పాలకుర్తి మండలంలో ఇంటింటి కుటుంబ సర్వే విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో ముగ్గురు అధికారులకు జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మెమొలు జారీ చేయడం చర్చంశనీమైంది. ఈనెల 6న (బుధవారం) రోజున జిల్లా కలెక్టర్ పాలకుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇంటింటి కుటుంబ సర్వే పై పరిశీలనకు వచ్చారు. పాలకుర్తిలో ముగ్గురు పై కలెక్టర్ తీవ్రస్థాయిలో మండిపడ్డట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కారణంతో పాలకుర్తి ఎంపీడీవో ఆవుల రాములు, మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య, పాలకుర్తి పంచాయతీ కార్యదర్శి కె వెంకటేశ్వరచారి కి మెమో జారీ చేశారు. కలెక్టర్ జారీ చేసిన మెమోకు గురువారం రోజున వారు సంజాయిషీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియాల్సి ఉంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై జిల్లా కలెక్టర్ కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఉద్యోగుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి.IMG-20241101-WA0218

Views: 63
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి  సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
పాల్వంచ (న్యూస్ ఇండియ) డిసెంబర్ 13:ఈ నెల 14 వ తేదీన జరగనున్న పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సర్పంచ్,వార్డు సభ్యులను...
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్
కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ