పాలకుర్తిలో ముగ్గురు అధికారులకు కలెక్టర్ మెమో జారీ

ఇంటింటి కుటుంబ సర్వే విధుల్లో నిర్లక్ష్యం

By Venkat
On
పాలకుర్తిలో ముగ్గురు అధికారులకు కలెక్టర్ మెమో జారీ

జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా

పాలకుర్తి మండలంలో ఇంటింటి కుటుంబ సర్వే విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో ముగ్గురు అధికారులకు జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మెమొలు జారీ చేయడం చర్చంశనీమైంది. ఈనెల 6న (బుధవారం) రోజున జిల్లా కలెక్టర్ పాలకుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇంటింటి కుటుంబ సర్వే పై పరిశీలనకు వచ్చారు. పాలకుర్తిలో ముగ్గురు పై కలెక్టర్ తీవ్రస్థాయిలో మండిపడ్డట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కారణంతో పాలకుర్తి ఎంపీడీవో ఆవుల రాములు, మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య, పాలకుర్తి పంచాయతీ కార్యదర్శి కె వెంకటేశ్వరచారి కి మెమో జారీ చేశారు. కలెక్టర్ జారీ చేసిన మెమోకు గురువారం రోజున వారు సంజాయిషీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియాల్సి ఉంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై జిల్లా కలెక్టర్ కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఉద్యోగుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి.IMG-20241101-WA0218

Views: 63
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జగన్ ను కలిసిన కళికాయి నారాయణ జగన్ ను కలిసిన కళికాయి నారాయణ
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు  తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
నూతనంగా సభ్యత్వం
సీజ్ ద షాప్
తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి
‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..