తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు అందుకున్న పసుపులేటి సుజాత

On
 తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు అందుకున్న పసుపులేటి సుజాత

న్యూస్ ఇండియా తెలుగు,నవంబర్ 17( నల్గొండ జిల్లా ప్రతినిధి):తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల లోనీ వివిధ రంగాలలో ప్రావీణ్యం కలిగిన కళాకారులకు ఈరోజు చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో డాక్టరేట్ అవార్డులను అర్హులకు tssst సంస్థ అందించారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన గాయనిమని పసుపులేటి సుజాత కు తెలుగు సంస్కృతి సాహితీసేవ ట్రస్టు ఆధ్వర్యంలో "హానర్ ఇస్ కాస్ "డాక్టరేట్ అవార్డు ను ఈరోజు అందించారు. ఈ సందర్భంగా పసుపులేటి సుజాత మాట్లాడుతూ సంస్థ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనతోపాటు వివిధ రంగాల్లో పురస్కారాలు అందుకుంటున్న ప్రతి ఒక్క కళాకారులకు అభినందనలు తెలియజేశారు .ఈ సత్కారం ,ఈ గౌరవం, కళాకారుల అభిమానం, ఎన్నటికీ మరువలేనని ఇంకా మరింత బాధ్యతతో కళా రంగంలో తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు .ఈ అవార్డును అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న కళాభిమానులందరికీ, నా తోటి కళాకారులకు, గాయని గాయకులకు, సంగీత సాహితీ ప్రియులకు ,కృతజ్ఞతలు తెలిపారు.

IMG-20241117-WA0026

Views: 147

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్