తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు అందుకున్న పసుపులేటి సుజాత

On
 తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు అందుకున్న పసుపులేటి సుజాత

న్యూస్ ఇండియా తెలుగు,నవంబర్ 17( నల్గొండ జిల్లా ప్రతినిధి):తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల లోనీ వివిధ రంగాలలో ప్రావీణ్యం కలిగిన కళాకారులకు ఈరోజు చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో డాక్టరేట్ అవార్డులను అర్హులకు tssst సంస్థ అందించారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన గాయనిమని పసుపులేటి సుజాత కు తెలుగు సంస్కృతి సాహితీసేవ ట్రస్టు ఆధ్వర్యంలో "హానర్ ఇస్ కాస్ "డాక్టరేట్ అవార్డు ను ఈరోజు అందించారు. ఈ సందర్భంగా పసుపులేటి సుజాత మాట్లాడుతూ సంస్థ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనతోపాటు వివిధ రంగాల్లో పురస్కారాలు అందుకుంటున్న ప్రతి ఒక్క కళాకారులకు అభినందనలు తెలియజేశారు .ఈ సత్కారం ,ఈ గౌరవం, కళాకారుల అభిమానం, ఎన్నటికీ మరువలేనని ఇంకా మరింత బాధ్యతతో కళా రంగంలో తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు .ఈ అవార్డును అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న కళాభిమానులందరికీ, నా తోటి కళాకారులకు, గాయని గాయకులకు, సంగీత సాహితీ ప్రియులకు ,కృతజ్ఞతలు తెలిపారు.

IMG-20241117-WA0026

Views: 120

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
ఖమ్మం మార్చి 1 ఖమ్మం న్యూస్ ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్ లో శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా భారత మాజీ...
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..
ఇంటర్ ఎగ్జామ్స్.., సెంటర్ అడ్రస్ కోసం ఇలా చేయండి!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ 
కార్పొరేషన్లో ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు