
జగన్ తో పవన్ ఢీ
Janasena Meeting : ఏపీలో జగన్ సర్కార్ పై పోరాటాన్ని మరింత పెంచేందుకు జనసేనాని సిద్ధమవుతున్నారు. పీఏసీ సమావేశంలో దీనికి సంబంధించి పలు కీలక తీర్మానాలు చేశారు. అటు పని చేసే వాళ్లకే పార్టీలో పదవులు అంటూ కూడా పవన్ కళ్యాణ్ శ్రేణులకు చెప్పుకొచ్చారు. విశాఖ ఎయిర్ పోర్టు ఘటన, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటుపైనా సమావేశంలో చర్చించారు. ప్రజా క్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించి అరాచక రీతిలో వెళ్ళడం వల్లే ప్రతిపక్షంగా బాధ్యత తీసుకొని జన గళం […]
Janasena Meeting : ఏపీలో జగన్ సర్కార్ పై పోరాటాన్ని మరింత పెంచేందుకు జనసేనాని సిద్ధమవుతున్నారు. పీఏసీ సమావేశంలో దీనికి సంబంధించి పలు కీలక తీర్మానాలు చేశారు.
అటు పని చేసే వాళ్లకే పార్టీలో పదవులు అంటూ కూడా పవన్ కళ్యాణ్ శ్రేణులకు చెప్పుకొచ్చారు.
విశాఖ ఎయిర్ పోర్టు ఘటన, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటుపైనా సమావేశంలో చర్చించారు.
ప్రజా క్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించి అరాచక రీతిలో వెళ్ళడం వల్లే ప్రతిపక్షంగా బాధ్యత తీసుకొని జన గళం వినిపిస్తుందని అన్నారు.
ప్రభుత్వం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ అప్రజాస్వామిక విధానాలు అవలంభిస్తోందని మండిపడ్డారు.
అక్రమ కేసుల్లో ఉన్నవారికి న్యాయపరమైన సహాయం అందించిన పార్టీ న్యాయ విభాగం సభ్యులను, న్యాయవాదులను అభినందిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు.
అయితే టీడీపీతో పొత్తు, రాబోయే రాజకీయ వ్యూహాలపై మాత్రం లోతుగా చర్చ జరగలేదు.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News

Comment List