గ్రూప్‌ 2 పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పి

ఎస్పి రోహిత్‌ రాజును తనిఖీ చేసిన భద్రతా సిబ్బంది

On
గ్రూప్‌ 2 పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పి

కొత్తగూడెంIMG-20241215-WA1034(న్యూస్ ఇండియా నరేష్)డిసెంబర్ 15 : జిల్లా వ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాల నందు నేడు గ్రూప్‌ 2 పరీక్షల జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి రోహిత్‌ రాజు పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. గ్రూప్‌ 2 పరీక్ష ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందని అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాలలో 13466 మంది అభ్యర్థులకుగాను 6324 మంది పరీక్షకు హాజరు హాజరయ్యారని, 7142 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు వివరాలు వెల్లడిరచారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 బిఎన్‌ఎస్‌ఎస్‌ (144 సెక్షన్‌) అమల్లో ఉన్నందున ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు అనుమతులు లేవని ప్రజలు గుంపులుగా ఉండరాదని ఆదేశించారు. జవాబు పత్రాలు తరలింపులోను ప్రత్యేక పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు నడుమ తరలింపు ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా కొత్తగూడెం పట్టణంలోని సింగరేణి ఉమెన్స్‌ మహిళా కళాశాలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన ఎస్పి రోహిత్‌ రజు పరీక్షా కేంద్రాలలోకి ప్రవేశించే ముందు ఎస్పి స్వయంగా భద్రతా సిబ్బందితో తనను తనిఖీ చేయించుకోడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే పరీక్షా కేంద్రాల వద్ద భద్రాతా ఏర్పాట్లు ఎంత పకడ్బందిగా ఉన్నాయో అర్థమవుతోంది.

Views: 92
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..