గ్రూప్‌ 2 పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పి

ఎస్పి రోహిత్‌ రాజును తనిఖీ చేసిన భద్రతా సిబ్బంది

On
గ్రూప్‌ 2 పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పి

కొత్తగూడెంIMG-20241215-WA1034(న్యూస్ ఇండియా నరేష్)డిసెంబర్ 15 : జిల్లా వ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాల నందు నేడు గ్రూప్‌ 2 పరీక్షల జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి రోహిత్‌ రాజు పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. గ్రూప్‌ 2 పరీక్ష ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందని అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాలలో 13466 మంది అభ్యర్థులకుగాను 6324 మంది పరీక్షకు హాజరు హాజరయ్యారని, 7142 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు వివరాలు వెల్లడిరచారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 బిఎన్‌ఎస్‌ఎస్‌ (144 సెక్షన్‌) అమల్లో ఉన్నందున ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు అనుమతులు లేవని ప్రజలు గుంపులుగా ఉండరాదని ఆదేశించారు. జవాబు పత్రాలు తరలింపులోను ప్రత్యేక పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు నడుమ తరలింపు ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా కొత్తగూడెం పట్టణంలోని సింగరేణి ఉమెన్స్‌ మహిళా కళాశాలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన ఎస్పి రోహిత్‌ రజు పరీక్షా కేంద్రాలలోకి ప్రవేశించే ముందు ఎస్పి స్వయంగా భద్రతా సిబ్బందితో తనను తనిఖీ చేయించుకోడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే పరీక్షా కేంద్రాల వద్ద భద్రాతా ఏర్పాట్లు ఎంత పకడ్బందిగా ఉన్నాయో అర్థమవుతోంది.

Views: 94
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

టెన్త్ విద్యార్థి ఆత్మహత్య  టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 
కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 13: ఈనెల 14వ తేదీ నుంచి  10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో   టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తగూడెంలో...
సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..