కార్పొరేషన్ ఏర్పాటుతో  సీపీఐ సంబరాలు 

సిపిఐ ఆఫీస్ వద్ద భారీ సంబరాలు 

On
కార్పొరేషన్ ఏర్పాటుతో  సీపీఐ సంబరాలు 

పాల్గొన్న  జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాషా

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) జనవరి5:కార్పొరేషన్ ఏర్పడడంతో సిపిఐ కార్యకర్తలు ఆదివారం సిపిఐ ఆఫీస్ వద్ద టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా మాట్లాడుతూ... శనివారం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడెంలోని 36 వార్డులు, పాల్వంచలోని 24 వార్డులు, సుజాతనగర్ మండలంలోని నాయకులగూడెం, లక్ష్మీదేవిపల్లి, నిమ్మలగూడెం, సుజాతనగర్, కోమటపల్లి, నర్సింగ్ సాగర్, మంగపేట గ్రామపంచాయతీలతో కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు . త్వరలో లక్ష్మీదేవిపల్లి,చుంచుపల్లి మండలంలోని కొన్ని గ్రామపంచాయతీలు కూడా కలిపే అవకాశం ఉందన్నారు . కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు కృషితోనే కార్పొరేషన్ ఏర్పడిందని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల ఏడో తారీఖున కొత్తగూడెం నియోజవర్గంలో ప్రజలతో సంబరాల కార్యక్రమం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే సాంబశివరావు హయాంలోనే ఎయిర్ పోర్ట్ IMG20250105180641 కూడా ఏర్పాటు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి మండల అధ్యక్షులు వాసిరెడ్డి మురళి, సీపీఐ నాయకులు కంచర్ల జమలయ్య, శ్రీనివాస్, లక్ష్మి, భాస్కర్, రమేష్, యాకూబ్, పిడుగు, చారి ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 133
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక