ప్రతి ఒక్కరూ రోడ్లపై సురక్షితంగా ప్రయాణించేలా చూసుకోవడం మన కర్తవ్యం మని ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు.

On
ప్రతి ఒక్కరూ రోడ్లపై సురక్షితంగా ప్రయాణించేలా చూసుకోవడం మన కర్తవ్యం మని ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు.

రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు నెహ్రూ యువ కేంద్ర, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, ట్రాఫిక్ పోలీసుల

ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ..ఆధునిక ప్రపంచంలో రవాణా, రోడ్డు ప్రతి మనిషికి నిత్యావసరాలుగా మారాయని, ఒక్కొక్కరు ఒక్కో విధంగా రోడ్లను ఉపయోగిస్తున్నారని అన్నారు. ప్రస్తుత రవాణా వ్యవస్థ ప్రయాణ సమయాన్ని తగ్గించినప్పటికీ, ఇది మానవ జీవితానికి ప్రమాదాన్ని కూడా పెంచిందన్నారు. ప్రతి సంవత్సరం, ట్రాఫిక్ ప్రమాదాలు వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్నాయని, కోట్లాది మంది ప్రజలను తీవ్ర గాయాలపాలు చేస్తున్నాయని పెర్కొన్నారు. ప్రతి సంవత్సరం 1,50,000 మందికి పైగా ట్రాఫిక్ ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారని నివేదికలు చెపుతున్నాయని అన్నారు.  రోడ్డు భద్రతా విధానాలను పాటిస్తే ట్రాఫిక్ ప్రమాదాలను గణనీయంగా  అరికట్టవచ్చని అన్నారు. భారతదేశంలో 72 శాతం ట్రాఫిక్ ప్రమాదాలు అతివేగం కారణంగా సంభవించాయి. రోడ్డుకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, వాహనం నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ వాడడం వంటివి చాలా సాధారణ కారణాలని అన్నారు.  కారు ప్రమాదాల బారిన పడిన ప్రతి ముగ్గురిలో ఇద్దరు 18 మరియు 45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు వున్నారని తెలిపారు. 

డ్రైవింగ్ చేసేటప్పుడు పరధ్యానం కలిగించే ప్రధాన వనరులలో ఒకటి సెల్ ఫోన్‌లు. మోటారు వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఫోన్‌లో మాట్లాడటం లేదా సోషల్ మీడియాను బ్రౌజ్ చేయడం చాలా ప్రమాదకరం అన్నారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని, ర్యాష్ డ్రైవింగ్, త్రీబుల్ రైడింగ్,  కారు డ్రైవర్ తప్పనిసరిగా సీట్ బెల్ట్ ఉపయోగించాలి. అదేవిధంగ సైక్లిస్ట్ హెల్మెట్ ధరించాలని అన్నారు.

Read More పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 

కార్యక్రమంలో  ట్రాఫిక్ సిఐ మోహన్ బాబు, ఆర్ ఐ సాంబశివరావు, నెహ్రూ యువ కేంద్ర ప్రోగ్రామ్ ఆఫీసర్ కమర్తపు భానుచందర్, ఎన్ ఎస్ ఎస్ పీఓలు రామకుమార స్వామి, శ్యామలదేవి, షారుఖ్ ఇమ్రాన్ ( పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు ), సునంద లెక్చరర్, ఉమెన్స్ డిగ్రీ కళాశాల, ఆటో డ్రైవర్లు  పాల్గొన్నారు.

Views: 21
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!