భద్రాద్రిలో ఘనంగా 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం

కొత్తగూడెం పట్టణంలో విద్యార్థులతో భారీ ర్యాలీ 

On
భద్రాద్రిలో ఘనంగా 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం

ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ 

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) జనవరి 25: భద్రాద్రి కొత్తగూడెంలో 15వ జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం  ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం పట్టణంలో విద్యార్థులతో  భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తగూడెం క్లబ్ లో నిర్వహించిన సమావేశనికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొని మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు బాధ్యతగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ జరిపించారు. కుల మత జాతి లింగ విభక్ష లేకుండా భారత రాజ్యాంగం అందించిన ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు. వివిధ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్, క్విజ్ ఇతర పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధాన చేశారు. ఇప్పటివరకు క్రమం తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకుంటున్న  సీనియర్ సిటిజన్స్ ను ఘనంగా శాలువాతో సన్మానించారు. కొంతమంది అధికారులకు కూడా జ్ఞాపికలు అందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ , న్యాయమూర్తి భానుమతి, ఆర్డీవో మధు, డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్, క్రీడల శాఖ అధికారి పరంధామ రెడ్డి, ఎమ్మార్వోలు, పుల్లయ్య, ప్రసాద్, కృష్ణ ప్రసాద్, శిరీష ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Views: 23
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మార్చి 09, న్యూస్ ఇండియా ప్రతినిధి: లంచం తీసుకుంటూ...
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి