ధూమపానం విడితే..క్యాన్సర్ పరార్..

పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాహశిల్దార్ మాచన రఘునందన్

On
ధూమపానం విడితే..క్యాన్సర్ పరార్..

ధూమపానం విడితే..క్యాన్సర్ పరార్

పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్...

ఎల్బీనగర్, ఫిబ్రవరి 04 (న్యూస్ ఇండియా ప్రతినిధి):- ధూమపానం ప్రాణ హననం కు దారితీస్తుందని, లైటర్ వెలిగించినంత తేలిగ్గా ..స్మోకింగ్ అలవాటు కు కూడా అలా.. "ఫర్ గెట్ ఇట్" అన్నంత తేలిగ్గా స్వస్తి పలుకుతూ..ఆరోగ్యవంతమైన జీవనాన్ని ఆస్వాదించాలని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాహ

IMG-20250203-WA0377(1)
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాహశిల్దార్ మాచన రఘునందన్..

శిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఆయన ప్రపంచ కాన్సర్ దినోత్సవం దినోత్సవం సందర్భంగా ..స్మోకర్స్ కు పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే అనర్థాల పై అవగాహన కలిగించారు. పొగ తాగడం వ్యసనం గా మారక ముందే ఫుల్ స్టాప్ పెట్టడం మంచిదని సూచించారు.పొగాకు, ధూమపానం అలవాట్లను వ్యసనపరుల చేత మాన్పించడం లో భాగంగా ఐదేళ్ల లో ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించి, ఐదు వందల గ్రామాల్లో ..ఎంతో మంది ని పొగాకు, ధూమపానం అలవాట్ల తో కలిగే అనర్థాలను వివరించినట్టు చెప్పారు. యువత సైతం స్నేహం వల్లో, సాంగత్య ప్రభావం వల్లనో స్మోకింగ్ ను అలవాటు చేసుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు.అందుకే కాలేజీ ల కు వెళ్లే విద్యార్థుల పై తల్లి దండ్రులు ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయ పడ్డారు.సరదా గా మొదలయ్యే అలవాటు వల్ల జీవితం అవాంఛనీయ ఘటనల కు దారి తీయటం వాంఛనీయం కాదని అన్నారు.వజ్ర తుల్య ధృఢ సంకల్పంతో సిగరెట్ తాగడం ,బీడీ కాల్చడం మానేయాలని హితవు చెప్పారు. దమ్ము కొట్ఠాలి ఆన్న కోరిక బలంగా ఉన్నపుడు ఆ ఆలోచన ను వేరే వైపు మరల్చడం ద్వారా లేదా మంచి నీళ్ళు తాగండం చేయాలన్నారు.యోగా చేయడం,ఏదైనా ఇతర పనుల పై దృష్టి పెట్టడం ద్వారా కూడా దమ్ము కొట్టాలి ఆన్న ఆలోచన ను క్రమ,క్రమంగా దూరం చేస్తూ..అధ్బుత ఫలితాన్ని సాధించవచ్చు అని రఘునందన్ చెప్పారు.

Read More తెలంగాణలో కూడా జొన్నగిరి తరహా బంగారు గనులు ఉన్నాయా? గద్వాల, వనపర్తి, నల్గొండలో గోల్డ్ మైనింగ్ అవకాశాలపై పూర్తి విశ్లేషణ

Views: 29

About The Author

Post Comment

Comment List

Latest News

సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్
వడ్డే నవీన్ మొదటి భార్య ఎవరు? విడాకుల తర్వాత కెరీర్ ఎందుకు క్షీణించింది? నిజాలు, ప్రచారాల పూర్తి విశ్లేషణ
భారతదేశంలోని 5 అత్యంత మిస్టరీ ప్రదేశాలు.. శాస్త్రవేత్తలకూ పూర్తి సమాధానం దొరకని రహస్యాలు!
అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం.. తవ్వితే అంతా బంగారమేనా? 2300 ఏళ్ల చరిత్రలో దాగిన నిజాలు!
ఏపీ Future Ready Ecosystem అంటే ఏమిటి? అమరావతి నుంచి విశాఖ వరకు భారీ డెవలప్‌మెంట్ మాస్టర్ ప్లాన్!
హోమ్ లోన్‌లో ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ తెలుసా? ఇలా చేస్తే లక్షల్లో వడ్డీ ఆదా చేసే ఛాన్స్!
5 వేల జీతం నుంచి ₹45 లక్షల ప్యాకేజీ.. బెంగళూరు టెక్కీ సక్సెస్ స్టోరీలో అసలు ట్విస్ట్ ఇదే!