రూ. 2.5 కోట్ల వ్యయంతో ‘జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ భవన నిర్మాణం’.
On
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 18, న్యూస్ ఇండియా : సంగారెడ్డి జిల్లా పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మించబోయే జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆర్&బి శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ , రోడ్లు మరియు భవనాల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. సుమారు రూ. 2.5 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నిర్మించాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ఈ పరిశీలనలో డి ఈ, ఆర్ అండ్ బి రామకృష్ణ, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Views: 27
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
21 Aug 2025 12:40:30
మేరా యువ భారత్ ఆధ్వర్యంలో సయ్యద్ యూత్ క్లబ్ వారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బీసీ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల నందు సద్భావన దివాస్ ఘనంగా...
Comment List