శవాలతో కూడా యుద్ధం చేస్తారా..? 

శవాలు అప్పగించకుండా ఆనవాళ్లు, సాక్ష్యాలు తారుమారు చేసే కుట్ర..?  -- మృతదేహాలను అప్పగించి అంత్యక్రియలు జరిగేలా చూడాలి

On
శవాలతో కూడా యుద్ధం చేస్తారా..? 

సీపీఐ (ఎంఎల్) మాన్ లైన్ (ప్రజాపంథా) కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి, తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు

 మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, ఇతర తెలుగు రాష్ట్రాల నేతలు మే 21 నాడు జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెంది 6 రోజులైనా బంధువులకు వారి మృతదేహాలను అప్పగించక పోవడం కేంద్ర, రాష్ట్ర బీజేపీ, ఏపీ కూటమి ప్రభుత్వ ఫాసిస్టు దుర్మార్గానికి నిదర్శనమని, బీజేపీ, టీడీపీ సర్కార్లు చచ్చిన శవాలకు కూడా భయపడి, శవాలతో యుద్ధం చేస్తున్నాయని సీపీఐ (ఎం.ఎల్) మాన్ లైన్ (ప్రజాపంథా) కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి, తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు దుయ్యాబట్టారు.

సీపీఐ (ఎం.ఎల్) మాన్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి, తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ.. ఇప్పటికైనా మృత దేహాలను బంధువులకు అప్పగించాలని, అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్బంధం, బెదిరింపులు ఆపాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి మృతదేహాలను అప్పగించడానికి 6 రోజులుగా అలస్యం చేయడములో ఆనవాళ్లు, సాక్ష్యాలను కనిపించకుండా చేసే కుట్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వాల, పోలిసుల ఈ దుర్మార్గ వైఖరి చూస్తే పట్టుకువచ్చి కాల్చి చంపినట్లు వచ్చే వార్తలను విశ్వసించేలా ఉందని ఆరోపించారు. మధ్య భారతంలో నరమేధం సృష్టిస్తున్నారని, సరిహద్దులలో చేసే యుద్ధం దండకారణ్యంలో చేస్తున్నారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు విధానంలో భాగంగానే ఇది జరుగుతున్నదని అన్నారు. అక్కడ దొరికే 29 రకాల విలువైన ఖనిజాలా కోసం కార్పొరేట్ కంపెనీల లాభాల దాహం కోసం ఈ నరమేధం చేస్తూ, రక్త పీపాసులుగా మారారని ఆరోపించారు. ఇప్పటికైనా నరమేధం ఆపి, శాంతి చర్చలు జరపాలని, శవాలను బంధువులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని, నరమేధం ఆపాలని, ఎన్కౌంటర్ లపై, ఆదివాసుల మరణాలపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకుడు గోకినేపల్లి వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. మాజీ శాసన సభ్యులు గుమ్మడి నర్సయ్యని, ఇతర రాజకీయ, ప్రజాసంఘాల నేతలను జియానపేట పోనియకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిచారు. అలానే జిల్లాలో, రాష్ట్రంలో పోడు భూములకు ఇంకా అన్నింటికీ పట్టాలు ఇవ్వలేదని, అలానే వారికి అన్ని రకాల రుణాలు, సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు గుర్రం అచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, గండమళ్ళ రామయ్య, ఝాన్సీ, మలీదు నాగేశ్వర్ రావులు పాల్గొన్నారు.

Views: 13
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

తెలంగాణ పోలీస్ సేవ పతకము" కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి.. తెలంగాణ పోలీస్ సేవ పతకము" కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి..
"తెలంగాణ పోలీస్ సేవ పతకము"కి ఎంపికైన చిప్పకుంట్ల వాసి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు.. తెలంగాణ పోలీస్ సేవ పతకము" కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి..  ట్రాఫిక్...
సిపిఎస్ వద్దు.. ఓపిఎస్ ముద్దు..
యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలి..
అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి...
సామాజిక తెలంగాణ నిర్మాణమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం: కొడకండ్ల మండలానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు**
‘కలెక్టర్ కార్యాలయం’ పేరు దుర్వినియోగం.
జిల్లా విద్యాధికారి కార్యాలయంలో వినతులు.