ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాన్ కి బాత్ లో జిల్లా మహిళలను స్కై వారియర్స్ గా గుర్తించడం చాలా ప్రోత్సాహకంగా ఉంది.
డ్రోన్ శిక్షణతో ఉపాధి మార్గాలు.. సంగారెడ్డి జిల్లా మహిళలు స్కై వారియర్స్గా ఎదుగుతున్నారు. మహిళా శక్తికి ప్రధాని గుర్తింపు...మాన్ కీ బాత్'లో సంగారెడ్డి మహిళల ప్రస్తావన. డ్రోన్ శిక్షణతో 20 వేల వరకు ఆదాయం పొందే అవకాశం. స్కై వారియర్స్గా వెలుగొందుతున్న సంగారెడ్డి మహిళలు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ఫలితం.. జిల్లాలో 52 మంది స్కై వారియర్స్ - జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 28, న్యూస్ ఇండియా : కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, ఇందిరా మహిళా శక్తి అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ జిల్లా మహిళలను ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు మాన్ కీ బాత్ కార్యక్రమం లో జిల్లా మహిళలను స్కై వారియర్స్ గుర్తించడం చాలా ప్రోత్సాహంగా ఉందన్నారు. ప్రధానమంత్రి గారి ఉపన్యాసంలో సంగారెడ్డి జిల్లా మహిళల గురించి స్కై వారియర్ గా అభివర్ణించడం చాలా గొప్ప విషయం అన్నారు. జిల్లాలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా 33 మంది మహిళలలు డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తు చేసుకోగా అందులో 28 మంది మహిళలు డ్రైవింగ్ శిక్షణకు అర్హత సాధించారన్నారు. అర్హత సాధించిన డ్రైవింగ్ మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎయిర్ పోర్టులో, కంపెనీలలో, సర్వీస్ టాక్సీ లలో, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని గ్రామీణ మహిళ అభివృద్ధి సంస్థను ఆదేశించారు. మహిళా సమాఖ్య సభ్యులు విద్యార్థులకు పాఠశాల తెరవక ముందే ఏకరూప దుస్తుల అందించాలని, ఏకరూప దుస్తుల కోసం క్లాత్ రెడీగా ఉందన్నారు. నమో దీదీ డ్రోన్ పథకం ద్వారా డ్రోన్ ట్రైనింగ్ పూర్తిచేసిన 52 మందినీ స్కై వారియర్స్ గుర్తించబడి అనేక ఉపాధి అవకాశాలు పొందుతున్నారన్నారు. డ్రోన్ శిక్షణ పొందిన మహిళలకు మహిళ గ్రూపుల్లో సబ్సిడీ పైన డ్రోన్ అందించే అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. డ్రోన్ శిక్షణ పొందిన మహిళలు ఎకరానికి 500 రూపాయలు పొందుతున్నారని, ఒక ఎకరం మందులు పిచికారి చేయడానికి అత్యల్పంగా పది నిమిషాల సమయం మాత్రమే పడుతుందని, డ్రోన్ ద్వారా మందులు పిచికారి చేయడంతో సమయము ,డబ్బు, నీరు ,ఆదా అవుతాయని, డ్రోన్ శిక్షణ పొందిన మహిళలకు నెలకు దాదాపు పదివేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, పి డి, డి ఆర్ డి ఏ జ్యోతి, అదనపు డి ఆర్ డి ఏ జంగారెడ్డి, అధికారులు, డి ఆర్ డి ఏ సిబ్బంది, ఎస్ హెచ్ జి గ్రూప్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Comment List