జిల్లా విద్యాధికారి కార్యాలయంలో వినతులు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 29, న్యూస్ ఇండియా : ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులను పెంచడంతోపాటు, యూనిఫార్మ్స్, పాఠంశ పుస్తకాలు, తదితర వ్యాపార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న వారిపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు పంబల్ల దురప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం నాడు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి కార్యాలయంలో ఏడి శంకర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పంబల్ల దురప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, , లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బైండ్ల అశోక్ కుమార్, ఉపాధ్యక్షులు కొత్తగొల్ల మల్లేష్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతురాజు పవన్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ సంచుల, జిల్లా కార్యదర్శులు జోగ్యల్ల రాజు, మన్నె సాగర్ మాజీ సర్పంచ్, సంగారెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు ఎస్.అర్ ప్రమోద్, ఉదయ్, కార్యదర్శులు నవ కాంత్, శ్రీకాంత్, సదానందం, విద్యసాగర్ సోషల్ మీడియా కన్వీనర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
Comment List