గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి..
హయత్ నగర్ బీజేవైఎం అధ్యక్షులు ఎర్ర ప్రేమ్..

గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి..
హయత్ నగర్ బీజేవైఎం అధ్యక్షులు ఎర్ర ప్రేమ్..!
ఎల్బీనగర్, జూన్ 04, న్యూస్ ఇండియా ప్రతినిధి: గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని హయత్ నగర్ డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు ఎర్ర ప్రేమ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు నేడు హయత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) నాగరాజ్ గౌడ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం

లో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్ మాట్లాడుతూ.. బక్రీద్ పండగ సందర్బంగా ఎక్కడ కూడా గోవధ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, హయత్ నగర్ డివిజన్ నగర్ నగర శివారులో ఉండడం మరియు ORR సమీపంలో ఉన్నందువల్ల గతంలో అక్రమంగా తరలిస్తున్న చాలా గోవులను పట్టుకొని పోలీస్ శాఖ వారికి అప్పగించడం జరిగిందని, నగరంలో ప్రవేశించడానికి ప్రముఖ మార్గం కావడంతో డివిజన్ శివారులో ప్రత్యేకమైన చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి గోవుల తరలింపును అడ్డుకొని, ఎక్కడ కూడా గోవధ జరగకుండా చర్యలు తీసుకోవాలని హయత్ నగర్ ఇన్స్పెక్టర్ కి వారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ హయత్ నగర్ డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీను, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పారంద మహేష్, నాయకులు ఎర్రవెలి సత్యనారాయణ, వస్పరి వెంకటేష్, పిట్టల మహేష్, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List