మహేశ్వరంలో ‘నషాముక్త్ భారత్ అభియాన్'..
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న అధ్యాపకులు..
మహేశ్వరంలో ‘నషాముక్త్ భారత్ అభియాన్'..
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న అధ్యాపకులు..

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం, ఆగస్టు 14 న్యూస్ ఇండియా ప్రతినిధి:- డ్రగ్స్ కు బానిసలై విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంగి రమేష్ అన్నారు. 'నషాముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎన్ఎస్ఎస్ పి.ఓ & ఎడిసి ఇన్చార్జి డాక్టర్ జాహెదా బేగం ఆధ్వర్యంలో మహేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక సామూహిక ప్రతిజ్ఞను చేయించారు. ప్రజలలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం సంగి రమేష్ మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని గమనిస్తే 1908 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఇంతియాసుద్దిన్ ఫారూఖి, అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీదేవి, డాక్టర్ ఉపేంద్ర, డాక్టర్ గోపాల్, చిన్నోజి, రవళిక, కుమార్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.
Comment List