బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అవగాహన సదస్సు.
On
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 10, న్యూస్ ఇండియా : సంగారెడ్డిలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అవగాహన సదస్సు తేదీ.09 జూన్ నాడు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ ఎక్సెంజ్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వినియోగదారుల సమస్యలు, బీఎస్ఎన్ఎల్ సేవలు, మొబైల్ సిగ్నల్స్, 4జి సేవలు, సర్వీస్ ప్లాన్స్ గురించి అడిగిన వారికి బీఎస్ఎన్ఎల్ అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్స్, ఫ్రాడ్ కాల్స్, ఎస్ఎంఎస్ గురించి బీఎస్ఎన్ఎల్ సిబ్బంది వివరించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారులతో పాటు బీఎస్ఎన్ఎల్ సిబ్బంది లక్ష్మీనారాయణ, రాఘవేంద్ర, శ్రీనివాస్, సత్యవేలు, సతీష్, సంతోష్, యాదయ్య తదితరులు పాల్గొని విజయవంతం చేసారని ఎజిఎం జగన్ రావ్ తెలిపారు.
Views: 25
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Jun 2025 16:48:34
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి, జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
Comment List