నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు... డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు

1912 కు ఫోన్ చేస్తే విద్యుత్ సమస్య పరిష్కారం

On
నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు... డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు

20 వేల మెగా వాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా చర్యలు. విద్యుత్ అంబులెన్స్ ల ఆవిష్కరణ, విద్యుత్ ఉద్యోగుల హెల్త్ క్యాంపును ప్రారంభించిన డిప్యూటీ సిఎం.

ఖమ్మం, జూన్ -18:

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు, ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, టీ.జి. ఎన్.పి.డి. సి.ఎల్. సిఎండి  కె. వరుణ్ రెడ్డి లతో కలిసి విద్యుత్ అంబులెన్స్ లను ఆవిష్కరించి, విద్యుత్ ఉద్యోగుల హెల్త్ క్యాంపును ప్రారంభించారు.

ఈ సందర్భంగా *డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ*  వరదల సమయంలో ఎవరు ఊహించని వేగంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేసిన సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.  ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ శాఖలో పారదర్శకత తీసుకొని వచ్చిందని, విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు సమయం కేటాయిస్తామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి విద్యుత్ సరఫరా చాలా కీలకమని, మన దగ్గర నిరంతరాయ విద్యుత్ సరఫరా అన్ని వర్గాలకు అందించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామని, సాంకేతిక సమస్యలు, వాతావరణ పరిస్థితుల వల్ల విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడినప్పుడు మరమ్మత్తు పనులు చేసే సమయంలో  కార్మికులకు ప్రమాదాలు జరగకుండా తప్పని సరిగా భద్రతా చర్యలు పాటించాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ శాఖలో పనిచేసే లైన్ మేన్ నుంచి సీఎండి వరకు కోటి రూపాయల ప్రమాద భీమా కల్పించడం జరిగిందని అన్నారు. కే.టి.పి.ఎస్. స్టేజి 7 వరకు, హైడల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మొత్తం గత ఉమ్మడి రాష్ట్ర హయాంలో ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన విద్యుత్ పాలసీ తీసుకొని వచ్చామని తెలిపారు. 2023 లో 15 వేల మెగావాట్ల విద్యుత్ పీక్ డిమాండ్ ఏర్పడిందని, 2025 మార్చి లో ఇది 17 వేల 162 మెగా వాట్లకు చేరుకున్నప్పటికీ ఎక్కడ విద్యుత్ కోతలు కాకుండా చూసుకున్నామని అన్నారు.  

2029-30 నాటికి 26 వేల మెగా వాట్ల, 2034-35 నాటికి 33 వేల 773 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడుతుందని అంచనాతో విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని, లక్ష కోట్ల రూపాయల వరకు ఇప్పటికే సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఎంఓయూ చేసుకున్నామని అన్నారు. బ్యాటరీ స్టోరేజ్  వంటి నూతన  విద్యుత్ ఉత్పత్తి రంగాలను కూడా పరిశీలిస్తున్నా మని అన్నారు. వ్యవసాయ పంప్ సెట్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 11 వేల 500 కోట్ల చెల్లిస్తుందని అన్నారు. గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా కోసం ప్రజా ప్రభుత్వం 2293 కోట్లను విద్యుత్ శాఖకు చెల్లించిందని అన్నారు. ప్రతి సంవత్సరం అన్ని వర్గాలు కలిపి దాదాపు 14 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించిందని  అన్నారు. 1912 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేస్తే విద్యుత్ అంబులెన్స్ వచ్చి మరమ్మత్తు పనులు పూర్తి చేస్తుందని, అంబులెన్స్ లో అవసరమైన సామాగ్రి, ఇంజనీర్, ట్రాన్స్ఫార్మర్ అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా *రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,* సామాన్యుల జీవన ప్రమాణాలు పెరిగేందుకు విద్యుత్ శాఖ పని తీరు కీలకమని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఆకాంక్షలకు అనుగుణంగా విద్యుత్ శాఖ సిబ్బంది వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు.  ఆర్టిసి కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే కోటి రూపాయల బీమా వస్తుందని, విద్యుత్ శాఖలో కూడా ఈ పథకం అమలు అవుతుందని, మిగిలిన శాఖలలోని ఉద్యోగులకు కూడా ఇది అమలు చేయాలని అన్నారు.

Read More మభ్యపెట్టే నైపుణ్యం, సృజనాత్మకమైన దోపిడీ ‘సెయింట్ ఆంథోనీస్ విధానం’

**టీ.జి. ఎన్.పి.డి. సి.ఎల్. సిఎండి  కె. వరుణ్ రెడ్డి మాట్లాడుతూ,* గత సంవత్సరం సెప్టెంబర్ లో వచ్చిన వరదల సమయంలో ఖమ్మం సర్కిల్ పరిధిలో 30 కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని, విద్యుత్ సిబ్బంది యుద్ద ప్రాతిపదికన పనిచేసి వారం రోజులలో ప్రతి గ్రామంలో విద్యుత్ సరఫరా పునర్వ్యవస్థీకరించారని తెలిపారు. ఓవర్ లోడింగ్ సమస్య ఉన్న దగ్గర నూతన లైన్స్, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకున్నామని, వేసవి కాలంలో అత్యధికంగా డిమాండ్ వచ్చినప్పటికీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేసుకున్నామని అన్నారు. 1912 ద్వారా వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు విద్యుత్ అంబులెన్స్ దోహదపడతాయని, ప్రతి అంబులెన్స్ లో సిబ్బందితో పాటు అడ్వాన్సు టూల్ కిట్ అందుబాటులో ఉంటుందని అన్నారు. విద్యుత్ సిబ్బందికి కోటి రూపాయల ప్రమాద భీమా అందించడంతో పాటు వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, ప్రతి సిబ్బందికి అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం ఎలక్ట్రికల్ సేఫ్టీ టూల్ కిట్లను విద్యుత్ సిబ్బందికి మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్.ఈ. ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ప్రజా ప్రతినిధులు, విద్యుత్ శాఖ సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Read More 'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి

Views: 4
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి 'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 23, న్యూస్ ఇండియా : కొంత మంది 'అవినీతి అధికారుల కక్కుర్తి పనులవల్ల' సంగారెడ్డి పట్టణం పరువు పోతుందని, చాల...
అంతర్జాతీయ యోగా దినోత్సవం.
పెద్దకడుబూరు మండలంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు...
మభ్యపెట్టే నైపుణ్యం, సృజనాత్మకమైన దోపిడీ ‘సెయింట్ ఆంథోనీస్ విధానం’
ప్రభుత్వ ఆదాయానికి గండి, పరోక్ష దోపిడీకి సిద్ధం!
'ఇండ్లు' లేకున్నా 'ఇంటి నెంబర్' లు అమ్మబడును!
నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు... డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు