ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
99 రోజుల కార్యచరణ ప్రణాళిక
ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ అంకిత్
భద్రాద్రి
కొత్తగూడెం(న్యూస్ఇండియా ప్రతినిధి)మార్చి 12: కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్లో గురువారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక,99 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని సంబంధించి జిల్లాలో నూతనంగా ఏర్పడిన సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్ పర్సన్స్, కార్పొరేటర్లకు, ప్రభుత్వ పథకాలపై ఒకరోజు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని 33జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. 3 స్థాయిలలో 99 రోజుల కార్యచరణ ప్రణాళిక నిర్వహిస్తున్నామన్నారు .అన్ని శాఖలను సమన్వయం చేస్తూ, 11 అంశాలపై కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ తరగతిలను ప్రజా ప్రతినిధులు అవగాహన కల్పించుకొని ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, ట్రైన్ కలెక్టర్ హేమంత్ శర్మ, డిఆర్డిఏ విద్యా చందన, జిల్లా పరిషత్ సీఈవో నాగలక్ష్మి, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడే గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి,ఆర్డీవోమధు , జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, కార్పొరేషన్ కమిషనర్ సుజాత, డిఎంహైచ్ఓ, భద్రాచలం ఎంవిఐ వెంకట పుల్లయ్య, ఇతర ఉన్న అధికారులు పాల్గొన్నారు.

Comment List