మద్యంతో కొడుకునే కోల్పోయానన్న కేంద్ర మంత్రి

On

మద్యంతో జరిగే దుష్పరిణామాలపై అన్నీ ఇన్నీ కావు. మద్యానికి బానిసైన తన కుమారుడి ప్రాణాలు కాపాడుకోలేకపోయానంటూ ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి కౌషల్ కిషోర్ కంటతడి పెట్టారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు తన భార్య ఎమ్మెల్యేగా ఉండేదని, అయినప్పటికీ సొంత కొడుకుని కాపాడుకోలేకపోయామని, అలాంటప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటని అన్నారు. తన కుమారుడు ఆకాష్ కిషోర్‌కు ఫ్రెండ్స్‌తో కలిసి మందు తాగే అలవాటు ఉందని ఆ అలవాటు మానుతాడనే ఆశతో డి-అడిక్షన్ సెంటర్‌లో చేర్చామని చెప్పారు. ఆరు నెలల […]

మద్యంతో జరిగే దుష్పరిణామాలపై అన్నీ ఇన్నీ కావు. మద్యానికి బానిసైన తన కుమారుడి ప్రాణాలు కాపాడుకోలేకపోయానంటూ ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి కౌషల్ కిషోర్ కంటతడి పెట్టారు.

తాను ఎంపీగా ఉన్నప్పుడు తన భార్య ఎమ్మెల్యేగా ఉండేదని, అయినప్పటికీ సొంత కొడుకుని కాపాడుకోలేకపోయామని, అలాంటప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటని అన్నారు.

తన కుమారుడు ఆకాష్ కిషోర్‌కు ఫ్రెండ్స్‌తో కలిసి మందు తాగే అలవాటు ఉందని ఆ అలవాటు మానుతాడనే ఆశతో డి-అడిక్షన్ సెంటర్‌లో చేర్చామని చెప్పారు.

ఆరు నెలల తర్వాత వివాహం కూడా చేశాం. అయితే, పెళ్లి తర్వాత మళ్లీ మందుతాగడం మొదలుపెట్టాడు. దురదష్టవశాత్తూ తాగుడు వల్లే ప్రాణాలు కోల్పోయాడు.

రెండేళ్ల క్రితం అక్టోబర్ 19న నా కొడుకు కాలం చేసేనాటికి అతనికి రెండేళ్ల పిల్లవాడు ఉన్నాడు” అని కౌషల్ కిషోర్ చెప్పారు.

తన కొడుకును కాపాడుకోలేకపోయాయని, కోడలుకు వైధవ్యం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇలాంటి దురదృష్టకర పరిస్థితి రాకుండా మీ కూతుళ్లు, అక్కాచెల్లెళ్లను కాపాడుకోవాలని కార్యక్రమనికి హాజరైన వారికి ఆయన సూచించారు.

Views: 3
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక