*నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి* *

*నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి* *

విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని వికాస్ హై స్కూల్ కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ అన్నారు.

 డివిజన్ కేంద్రంలోని వికాస్ హై స్కూల్ లో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించారు.

     విద్యార్థులకు నమూనా పోలింగ్‌ నిర్వహించి, తద్వారా ఓటింగ్‌, ఎన్నికల విధానం పై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉత్సాహంగా నమూనా ఎన్నికల్లో పాల్గొన్నారు. తొర్రూరు కౌన్సిలర్లు పలువురు విద్యార్థులు నామినేషన్లు వేయడంతో పాటు బ్యాలెట్‌ పేపరు ద్వారా ఓటు వేయడం, ఓట్ల లెక్కింపు, ఎన్ని కల్లో గెలుపొందిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేయడం వంటి అంశాలపై అవ గాహన కల్పించారు. ఓటర్లుగా, అభ్యర్థులుగా, ఎన్నికల అధికారులుగా, పోలీసులుగా విద్యార్థులు వ్యవహరించారు. దీంతో పాఠశాలలో ఎన్నికల వాతావరణం నెలకొంది.

        ఈ సందర్భంగా కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ మాట్లాడుతూ... ఎన్నికల విధానంపై విద్యార్థులకు అవగాహన అవసరమని, భవిష్యత్తులో విద్యార్థులే దేశానికి నాయకత్వం వహిస్తారని తెలిపారు.
ఎన్నికల విధానం తెలియడం ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రెసిడెంట్ రేవూరి వెంకన్న, డైరెక్టర్ కేవీ రెడ్డి, విజయభాస్కర్, శ్రీలత, ప్రిన్సిపాల్ వేణుమాధవ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Views: 53
Tags:

Post Comment

Comment List

Latest News

నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన.. నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన.. నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన.. హైదరాబాద్, మార్చి 11, న్యూస్ ఇండియా ప్రతినిధి: పొగాకు వ్యసనంపై సమాజాన్ని అప్రమత్తం...
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..