*నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి* *

*నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి* *

విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని వికాస్ హై స్కూల్ కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ అన్నారు.

 డివిజన్ కేంద్రంలోని వికాస్ హై స్కూల్ లో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించారు.

     విద్యార్థులకు నమూనా పోలింగ్‌ నిర్వహించి, తద్వారా ఓటింగ్‌, ఎన్నికల విధానం పై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉత్సాహంగా నమూనా ఎన్నికల్లో పాల్గొన్నారు. తొర్రూరు కౌన్సిలర్లు పలువురు విద్యార్థులు నామినేషన్లు వేయడంతో పాటు బ్యాలెట్‌ పేపరు ద్వారా ఓటు వేయడం, ఓట్ల లెక్కింపు, ఎన్ని కల్లో గెలుపొందిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేయడం వంటి అంశాలపై అవ గాహన కల్పించారు. ఓటర్లుగా, అభ్యర్థులుగా, ఎన్నికల అధికారులుగా, పోలీసులుగా విద్యార్థులు వ్యవహరించారు. దీంతో పాఠశాలలో ఎన్నికల వాతావరణం నెలకొంది.

        ఈ సందర్భంగా కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ మాట్లాడుతూ... ఎన్నికల విధానంపై విద్యార్థులకు అవగాహన అవసరమని, భవిష్యత్తులో విద్యార్థులే దేశానికి నాయకత్వం వహిస్తారని తెలిపారు.
ఎన్నికల విధానం తెలియడం ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రెసిడెంట్ రేవూరి వెంకన్న, డైరెక్టర్ కేవీ రెడ్డి, విజయభాస్కర్, శ్రీలత, ప్రిన్సిపాల్ వేణుమాధవ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Views: 52
Tags:

Post Comment

Comment List

Latest News

తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం... తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం... మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్ నాయక్... మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్...
#Draft: Add Your Title
అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )
విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్