గోలిగూడెంను గ్రామపంచాయతీగా ఏర్పాటుకు అఖిలపక్ష నాయకుల ఆమోదం

హర్షం వ్యక్తం చేసిన గోలిగూడెం గ్రామస్తులు

On
గోలిగూడెంను గ్రామపంచాయతీగా ఏర్పాటుకు అఖిలపక్ష నాయకుల ఆమోదం

IMG_20230928_115340
గ్రామ సభలో పాల్గొన్న పులిగిల్ల గ్రామస్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామం మదిర గోలిగూడెంను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయుటకు పులిగిల్ల గ్రామ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆమోదం తెలపడం జరిగింది. శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన గ్రామసభలో గ్రామ వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ వివిధ పార్టీల అధ్యక్షుల అందరి సమక్షంలో జరిగిన సమావేశంలో గోలిగూడెంను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయుటకు ప్రతి ఒక్కరి అభిప్రాయ, సంతకాల సేకరణ చేసి ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ తీర్మానం చేయడం జరిగింది. గ్రామపంచాయతీ ఏర్పాటు చేయుటకు తగినంత ఓటర్ శాతం కూడా ఉండడంతో గోలిగూడెం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున గ్రామసభకు హాజరవ్వడం జరిగింది. పులిగిల్ల గ్రామ ప్రజలు అందరూ ఆమోదం తెలపడంతో వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జక్కా వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ బండారు ఎల్లయ్య, గ్రామ సెక్రెటరీ బూడిద పావని,ఉపసర్పంచ్ ఫైళ్ళ రవీందర్ రెడ్డి, వార్డు మెంబర్లు గ్రామ పార్టీల అఖిలపక్ష నాయకులు, గ్రామ యువత, తదితరులు పాల్గొనడం జరిగింది.

Views: 459
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి