ఏపీలో అందోళనకరంగా ధియేటర్ల పరిస్థితి

On

ఎక్కడైనా ఉన్నవాటికి పోటీగా కొత్తవి పుట్టుకొస్తాయి. మార్కెట్ కాంపిటిషన్‌లో పోటీపడి నిలదొక్కుకుంటాయి. ఏపీలో ఇప్పుడు సినిమా పరిశ్రమ దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. కొత్త ధియేటర్ల మాట అటుంచితే.. ఉన్నవాటినే నడపలేక మూసేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సినిమాలు ప్రదర్శించాలంటే ఎదురు తమ జేబుకే చిల్లు పడుతుందనేది యాజమాన్యాల మాట. అఖండ, పుష్ప, శ్యామ్‌సింగరాయ్‌ లాంటి సినిమాల రిలీజ్‌తో మార్కెట్‌కి హౌస్‌ఫుల్‌ టాక్ వచ్చినా కూడా తాము ధియేటర్లు నడపలేమని వారంటున్నారు. తాజాగా ఆసియాలోనే 2వ అతిపెద్ద ధియేటరైన […]

ఎక్కడైనా ఉన్నవాటికి పోటీగా కొత్తవి పుట్టుకొస్తాయి. మార్కెట్ కాంపిటిషన్‌లో పోటీపడి నిలదొక్కుకుంటాయి. ఏపీలో ఇప్పుడు సినిమా పరిశ్రమ దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. కొత్త ధియేటర్ల మాట అటుంచితే.. ఉన్నవాటినే నడపలేక మూసేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సినిమాలు ప్రదర్శించాలంటే ఎదురు తమ జేబుకే చిల్లు పడుతుందనేది యాజమాన్యాల మాట.

అఖండ, పుష్ప, శ్యామ్‌సింగరాయ్‌ లాంటి సినిమాల రిలీజ్‌తో మార్కెట్‌కి హౌస్‌ఫుల్‌ టాక్ వచ్చినా కూడా తాము ధియేటర్లు నడపలేమని వారంటున్నారు. తాజాగా ఆసియాలోనే 2వ అతిపెద్ద ధియేటరైన V-ఎపిక్ కూడా మూతపడింది. ఇప్పటికి ఇలా మూతపడిన ధియేటర్ల సంఖ్య 125కి చేరింది. చూస్తుంటే ఇది ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదనే ఆందోళన కూడా ఉంది.

తెలంగాణలో పోలిస్తే ఏపీలో ధియేటర్లు చాలా ఎక్కువ. దాదాపు వెయ్యి ధియేటర్లు రాష్ట్రవ్యాప్తంగా ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవన్నీ ఇప్పుడు క్లోజ్ చేసేసి కల్యాణ మండపాలుగా మారిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

Views: 4
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
ఖమ్మం మార్చి 4 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ఖమ్మం ప్రకాష్ నగర్28వ డివిజన్ కార్పొరేటర్ గజ్జెల లక్ష్మీవెంకన్న ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్...
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి