గాంధీ జయంతి వేడుక
పాల్గొన్న సర్పంచ్ రమాదేవి రాములు గౌడ్
పూల మాల వేసి టెంకాయలను కొట్టి మహర్షులకు మంత్ర శక్తి ఉన్నట్టే.. మహాత్ముడికి మాట శక్తి ఉంది.
న్యూస్ ఇండియా తెలుగు బ్యూరో: ప్రతినిధి
చౌదరిగూడ గ్రామపంచాయతీ లో సర్పంచ్ రమాదేవి రాములు గౌడ్ గాంధీ జయంతి సందర్భంగా గ్రామపంచాయతీ దగ్గర గాంధీజీ బొమ్మకు పూల మాల వేసి టెంకాయలను కొట్టి మహర్షులకు మంత్ర శక్తి ఉన్నట్టే.. మహాత్ముడికి మాట శక్తి ఉంది. ఆయన పలుకు పదునైన రామబాణం. నేరుగా మనసును తాకుతుంది. ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఆచరణ దిశగా అడుగులు వేయిస్తుంది. స్వాతంత్య్రోద్యమ సమయంలో జాతిమొత్తం ఆ మాటకే కట్టుబడి ఉంది. నిరాహారదీక్ష చేయమంటే చేసింది. అని సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ అన్నారు*.ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ కుర్ర మహేందర్ గౌడ్ పంచాయతీ కార్యదర్శి శశి కుమార్, వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు నాయకులు పాల్గొన్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List