తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి
కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి
By Venkat
On
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు
కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు దర్శించుకున్నారు. ఈ ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు వారికి స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందచేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బి అర్ ఎస్ పార్టీ విజయం సాధించాలని, సీఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. బి అర్ ఎస్ జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
Views: 54
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Nov 2025 18:25:39
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...

Comment List