టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్-2 పరీక్ష వాయిదా.. తీవ్ర మనస్తాపంతో అభ్యర్థిని ఆత్మహత్య?
బిక్కాజిపల్లి గ్రామంలో ముగిసిన ప్రవళిక అంత్యక్రియలు.. ఆ నోట్ లో ఎం రాసిందో చూడండి
వరంగల్ జిల్లాకు చెందిన ప్రవల్లికి పోటీ పరీక్షల కోసం అశోక్ నగర్లో ఉంటూ ప్రిపేర్ అవుతోంది..తాజాగా, గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా పడటంతో మనస్తాపానికి గురైన ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు.. సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..ప్రవళిక మృతితో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
హైదరాబాద్లోని అశోక్నగర్లో బృందావన్ లేడీస్ హాస్టల్లో ఉంటూ ప్రవల్లిక(23) గ్రూప్-2 పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఎన్నికల కారణంగా గ్రూప్-2 పరీక్ష వాయిదా పడడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన యువతి.. హాస్టల్లోని తన రూంలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఘటనాస్థలానికి చిక్కడపల్లి పోలీసులు చేరుకున్నారు. అక్కడ నుంచి మృతదేహాన్ని తరలించే క్రమంలో భారీ ఎత్తున విద్యార్థులు అక్కడకు చేరుకున్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List