టీఎస్​పీఎస్సీ నిర్వహించే గ్రూప్​-2 పరీక్ష వాయిదా.. తీవ్ర మనస్తాపంతో అభ్యర్థిని ఆత్మహత్య?

బిక్కాజిపల్లి గ్రామంలో ముగిసిన ప్రవళిక అంత్యక్రియలు.. ఆ నోట్ లో ఎం రాసిందో చూడండి

By Teja
On
టీఎస్​పీఎస్సీ నిర్వహించే గ్రూప్​-2 పరీక్ష వాయిదా..  తీవ్ర మనస్తాపంతో అభ్యర్థిని ఆత్మహత్య?

వరంగల్ జిల్లాకు చెందిన ప్రవల్లికి పోటీ పరీక్షల కోసం అశోక్ నగర్‌లో ఉంటూ ప్రిపేర్ అవుతోంది..తాజాగా, గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా పడటంతో మనస్తాపానికి గురైన ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందని ఫ్రెండ్స్‌ చెబుతున్నారు.. సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..ప్రవళిక మృతితో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

హైదరాబాద్​లోని అశోక్​నగర్​లో బృందావన్​ లేడీస్​ హాస్టల్​లో ఉంటూ ప్రవల్లిక(23) గ్రూప్​-2 పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఎన్నికల కారణంగా గ్రూప్​-2 పరీక్ష వాయిదా పడడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన యువతి.. హాస్టల్​లోని తన రూంలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఘటనాస్థలానికి చిక్కడపల్లి పోలీసులు చేరుకున్నారు. అక్కడ నుంచి మృతదేహాన్ని తరలించే క్రమంలో భారీ ఎత్తున విద్యార్థులు అక్కడకు చేరుకున్నారు.Pravallika-Suicide-letter-over-TSPSC-exam-delay-at-Hostel

క్షమించండి అమ్మా : "నన్ను క్షమించండి అమ్మా! నేను చాలా నష్టజాతకురాలిని.. నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. ఏడవకండి అమ్మా.. జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం అమ్మా.. నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు.. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా.. నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం నేను ఏం చేయలేపోతున్నా అమ్మా.. ప్రణీ అమ్మానాన్న జాగ్రత్త! అంటూ ప్రవల్లిక రాసిన సూసైడ్​ నోట్​ వాట్సాప్​ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది.
Views: 3

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే
*జిల్లా ప్రధమ పౌరుడు అయినా సామాన్యుడే**హంగు అర్బాటాలు లేవు అధికారం ఉందని గర్వం లేదు* మహబూబాబాద్ పట్టణంలోని ఓ పోలింగ్ కేంద్రంలో సామాన్యుల వలే లైన్ లో...
ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే