తెలంగాణలో కాకరేపుతోన్న మునావర్‌ ఫరూఖీ టూర్‌

On

వివాదాస్పద స్టేండప్‌ కమిడియన్‌ మునావర్‌ ఫరూఖీ టూర్‌.. తెలంగాణలో కాకరేపుతోంది. కామెడీ షోలలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మునావర్‌.. జనవరి 9వ హైదరాబాద్‌లో షో నిర్వహిస్తుండటంపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే 16 రాష్ట్రాలు నిషేధించిన వ్యక్తిని తెలంగాణలో ఎలా షో నిర్వహించుకోనిస్తున్నారని.. ప్రభుత్వంపై ఫైర్‌ అవుతున్నాయి. జనవరిలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మునావర్‌ అరెస్ట్‌ అయ్యారు. హిందూ దేవుళ్లను అవమానిస్తూ మాట్లాడారని.. బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో […]

వివాదాస్పద స్టేండప్‌ కమిడియన్‌ మునావర్‌ ఫరూఖీ టూర్‌.. తెలంగాణలో కాకరేపుతోంది. కామెడీ షోలలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మునావర్‌.. జనవరి 9వ హైదరాబాద్‌లో షో నిర్వహిస్తుండటంపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే 16 రాష్ట్రాలు నిషేధించిన వ్యక్తిని తెలంగాణలో ఎలా షో నిర్వహించుకోనిస్తున్నారని.. ప్రభుత్వంపై ఫైర్‌ అవుతున్నాయి.

జనవరిలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మునావర్‌ అరెస్ట్‌ అయ్యారు. హిందూ దేవుళ్లను అవమానిస్తూ మాట్లాడారని.. బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో 37 రోజులు జైల్లో ఉన్న మునావర్‌.. సుప్రీంకోర్టు బెయిల్‌ ఇవ్వడంతో బయటకొచ్చారు. అప్పటి నుంచి హిందూ సంఘాలు, బీజేపీ నేతలు.. మునావర్‌ షోలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం.. బెంగళూర్‌, గుర్‌గావ్‌, రాయ్‌పూర్‌, సూరత్‌, అహ్మదాబాద్‌, వడోదర, గోవా, ముంబైలలో మునావర్‌ ఫరుఖీ షోలు రద్దయ్యాయి. హిందూ సంఘాల హెచ్చరికలతో నవంబర్‌ 28న బెంగళూర్‌లో జరగాల్సిన షో కూడా రద్దయ్యింది.

మునావర్‌ చుట్టూ ఇంత వివాదం జరుగుతున్న నేపథ్యంలోనే.. మంత్రి కేటీఆర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌.. హైదరాబాద్‌, భోపాల్‌లలో షోలు చేసుకోవాడానికి ఆహ్వానించారు. ఇప్పుడిదే హిందూ
సంఘాల ఆగ్రహానికి కారణమవుతోంది. మరీ హైదరాబాద్‌లో షో జరుగుతుందో లేక మిగితా నగరాలలో మాదిరిగానే రద్దవుతుందో చూడాలి.

Views: 2
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..