ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున పాటించాల్సిన నియమాలు
వలిగొండ ఎస్సై పెండ్యాల ప్రభాకర్
1.దసరా ఉత్సవాలను నిర్వహించే కమిటీ లేదా అధికారులకు ప్రజలు సహాయ సహకారాలు అందిస్తూ ఉత్సవాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం.
2
.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారి పై కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోబడతాయి.
3.దసరా ఉత్సవాలలో ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉత్సవాల్ని జరుపుకోవాలి.
4.దసరా ఉత్సవాలలో రాజకీయ ఉపన్యాసాలు చేయ్యరాదు, వ్యక్తిగత మరియు వేరే పార్టీలపై కూడా దూషణలు చేయరాదు.
5.దసరా పండగ సంబంధించిన వేదికను లేదా అట్టి ప్రాంగణాన్ని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదు.
6.దసరా ఉత్సవాలలో పాల్గొనే మహిళలు మరియు చిన్న పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలని తెలుపుతున్నాం.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List