కొత్తవలస రైల్వే ప్రమాదంపై ఆవేదన

ఇంకా ఎంతమంది చనిపోతే రైల్వే వ్యవస్థలో మార్పు తీసుకొస్తారు

On
కొత్తవలస రైల్వే ప్రమాదంపై ఆవేదన

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

న్యూస్ ఇండియా తెలుగు:IMG-20231030-WA0214 విజయనగరం

విజయనగరం జిల్లా కొత్తవలసలో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో విజయనగరం వైపు బయలుదేరి రైల్వే ట్రాక్ పై ఉన్న  విశాఖపట్నం పలాస రైలును కొద్ది నిమిషాలు తేడాతో విశాఖపట్నం రాయగడ రైలు ఢీకొంది ఈ ప్రమాదంలో రాయగడ భోగిలో  కొన్ని పట్టాలు తప్పయి ఈ ప్రమాదం రాత్రి 7 గంటల తర్వాత జరగడంతో సహాయక  చర్యలకు చాలా ఇబ్బందిగా మారింది ఎవరు ఏ  భోగిలో ఇరుక్కున్నారు అన్నది సరిగ్గా కనిపించలేదు మొత్తం పలాస రాయగడ ప్యాసింజర్ లో 1400 మంది ప్రయాణికులు ఉన్నారు మృతుల సంఖ్య  సంఖ్య 40 నుంచి 50 వరకు పెరిగే అవకాశం ఉందని  సమాచారం  దీనిపై స్పందించిన రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు  ఎంతమంది చనిపోతే రైల్వే వ్యవస్థలో మార్పు తీసుకొస్తారని తీవ్ర  ఆవేదన వ్యక్తం చేశారు 10 సంవత్సరాల క్రితం తెలంగాణలో జరిగిన ఒక రైల్వే ప్రమాదంలో కరెంట్ షాక్ వచ్చి  చాలామంది భోగిలోనే బూడిద అయిపోయారు అప్పటి రాజ్యసభ సభ్యులు చిరంజీవి రైల్వే వ్యవస్థలో మార్పు తీసుకురావాలని చెప్పి అప్పటి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ సంవత్సరం జూన్ లో  జరిగిన బాలేస్వర్ రైలు ప్రమాదం కూడా ఇదే విధంగా జరిగిందని అప్పుడు కూడా అనేకమంది రైల్వే వ్యవస్థలో మార్పు తీసుకురావాలని పెద్ద ఎత్తున తన యొక్క వాయిస్ వినిపించారని అయినా  మళ్లీ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని ఆడారి నాగరాజు తీవ్ర  ఆవేదన వ్యక్తం చేశారు

Views: 69
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News