కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన ఆకుల సతీష్, రజిని

కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు

On
కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన ఆకుల సతీష్, రజిని

మహిళా రాష్ట్ర నాయకురాలు ఆకుల రజిని

జనగామ పట్టణానికి చెందిన తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు ఆకుల సతీష్ కుమార్,మహిళా రాష్ట్ర నాయకురాలు ఆకుల రజిని IMG-20231107-WA0685 మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. సతీష్

గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ కోదండరాం సార్ తో కలిసి ఉద్యమం చేసి స్వరాష్ట్రం సిద్దించే వరకు పోరు చేసిన ఉద్యమకారులు. అలాగే జనగామ జిల్లా సాధన ఉద్యమంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. జిల్లా సాధనలో వరంగల్ సెంట్రల్ జైలులో వారం రోజులు గడిపారు. 

తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రాజీనామా చేశారు. వీరి సతిమణి మహిళా రాష్ట్ర నాయకురాలు ఆకుల రజిని జిల్లా ఎర్పాటు కోసం జనగామ మున్సిపల్ కౌన్సిలర్ గా మొదటి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.వీరు ఇరువురు

మంగళవారం మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బిఆర్ఎస్ జనగామ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డితో సంప్రదింపులు జరిపి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

Read More ఎలక్ట్రిక్‌ వాహనాలతో పర్యావరణ పరిరక్షణ: MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్‌రెడ్డి

Views: 101
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News