TS rtc charges: తెలంగాణలో మళ్లీ బస్సు ఛార్జీల మోత

On

TS rtc charges: ఇప్పటికే ధరాఘాతంలో అల్లాడుతున్న సామాన్యుడికి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెలంగాణలో మరోసారి సెస్ రూపంలో ఆర్టీసీ ఛార్జీల మోత మోగించింది. కిలోమీటర్‌ వారీగా పెంచిన డీజీల్ సెస్‌ను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి గ్రేటర్ పరిధిలో మినహా అన్ని రకాల ఆర్టీసీ బస్సులో అదనపు డీజీల్ సెస్ వసూలు చేయనున్నారు. ప‌ల్లె వెలుగులో 250 కిలోమీటర్లకు 5 రూపాయల నుంచి 45 రూపాయలు పెంచారు. ఇక ఎక్స్‌ప్రెస్‌ బస్సులో […]

TS rtc charges: ఇప్పటికే ధరాఘాతంలో అల్లాడుతున్న సామాన్యుడికి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెలంగాణలో మరోసారి సెస్ రూపంలో ఆర్టీసీ ఛార్జీల మోత మోగించింది. కిలోమీటర్‌ వారీగా పెంచిన డీజీల్ సెస్‌ను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి గ్రేటర్ పరిధిలో మినహా అన్ని రకాల ఆర్టీసీ బస్సులో అదనపు డీజీల్ సెస్ వసూలు చేయనున్నారు.

ప‌ల్లె వెలుగులో 250 కిలోమీటర్లకు 5 రూపాయల నుంచి 45 రూపాయలు పెంచారు. ఇక ఎక్స్‌ప్రెస్‌ బస్సులో 500 కిలోమీటర్లకు 5 రూపాయల నుంచి 90 రూపాయలకు పెంచారు. డీల‌క్స్‌లో 500 కిలోమీటర్లకు 5 రూపాయల నుంచి 125 రూపాయలకు పెంచగా.. సూప‌ర్ ల‌గ్జరీలో 500 కిలోమీటర్లకు 10 రూపాయల నుంచి 130 రూపాయలకు పెంచారు. ఏసీ బస్సుల్లో 500 కిలోమీటర్లకు 10 రూపాయల నుంచి 170 రూపాయలు పెంచింది తెలంగాణ ఆర్టీసీ. అయితే తక్కువ దూరం ప్రయాణించే వారిపై భారం పడకుండా స్లాబ్‌లు విధించారు.

ఇక.. గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో డీజిల్ సెస్ పెంపులేదని ప్రకటించింది టీఎస్‌ఆర్టీసీ. దీంతో గ్రేటర్‌ బస్సుల్లో ప్రయాణీకులపై ఎలాంటి ప్రభావం ఉండదు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి అదనపు డీజిల్ సెస్ అనివార్యమని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. గతంలో రౌండప్‌, టోల్‌ ప్లాజాలు, ప్యాసింజర్స్‌ సెస్‌ పేరిట ఒకసారి ఛార్జీలు పెంచిన ఆర్టీసీ మరోసారి ఏప్రిల్‌లో డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రయాణికులపై భారం మోపింది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.