నో యాక్సిడెంట్స్ డే నిర్వహించిన ఎస్సై నరసింహా రావు

On
నో యాక్సిడెంట్స్ డే నిర్వహించిన ఎస్సై నరసింహా రావు

బి పేట న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండల ఎస్సై బి.నరసింహా రావు అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై గల పందిళ్లపల్లి టోల్ ప్లాజా వద్ద శనివారం నో యాక్సిడెంట్ డే కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమం లో భాగంగా ఎస్సై నరసింహా రావు ద్విచక్ర వాహనాల పై హెల్మెంట్ ధరించకుండా ప్రయాణం చేస్తున్న వారికి, అలానే లైసెన్స్, వాహన సంభందిత పత్రాలు లేని వారిని పరిశీలించి అపార రుసుము విధించారు.ఈ సందర్భంగా ఎస్సై నరసింహా రావు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల పై ప్రయాణం చేసేవారు తగిన నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని అన్నారు.నిబంధనలను పాటించని యెడల చట్ట ప్రకారం తగిన చర్యలతో పాటు రోడ్డు ప్రమాదానికి గురైన యెడల మీ కుటుంబం పరిస్థితులు కూడా మారిపోతుందని హెచ్చరించారు.అలానే ప్రయాణ సమయం లో హెల్మెంట్ తప్పకుండా ఉపయోగించాలని అన్నారు.అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని చట్ట ప్రకారం ఉన్న నిబంధనలను తప్పక పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20231118-WA0237
హెల్మెంట్ ప్రాముఖ్యతను వివరిస్తున్న ఎస్సై నరసింహా రావు
Views: 212

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి
  ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో కంఠాయపాలెం రోడ్డులోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన
కొత్తగూడెంలో తల్లి హత్య కొడుకుఆత్మహత్య
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్