
భువనగిరిలో పైళ్ళ శేఖర్ రెడ్డి గెలుపును ఎవరు ఆపలేరు
బీ ఆర్ ఎస్ జిల్లా నాయకులు ఎలిమినేటి జంగారెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పహిల్వాన్ పురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఎలిమినేటి జంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో అధికారం చేపట్టబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని,రాష్ట్ర ప్రజలు మూడవసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ కావాలని కోరుకుంటున్నారని అన్నారు,తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలందరికీ సమన్యాయం చేశాయని,కేసిఆర్ పై ప్రజలకు నమ్మకం ఉందని రాబోయే రోజుల్లో సరికొత్త పథకాలను కెసిఆర్ తీసుకొస్తారని అన్నారు,భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ళశేఖర్ రెడ్డి గత తొమ్మిదేళ్ల కాలంలో నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని,పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల వారికి తన సొంత నిధులతో ఎంతోమందికి ఆర్థిక సహాయాన్ని చేశారని అడిగిన వెంటనే తన మన అనే భేదం లేకుండా అందరికీ తన వంతు సహాయం అందించే గొప్పవ్యక్తి అని,రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొంది, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తారని మా ఎమ్మెల్యే పై నియోజకవర్గ ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని అన్నారు, అందుకే భువనగిరి నియోజకవర్గ ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో ఎమ్మెల్యే. శేఖర్ రెడ్డిని గెలిపించాలని వారు అన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List