ఇందిరమ్మ రాజ్యం లేకపోతే ప్రజలంతా అడుక్కుతినట్లే

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

By Ramesh
On
ఇందిరమ్మ రాజ్యం లేకపోతే ప్రజలంతా అడుక్కుతినట్లే

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం

ఇందిరమ్మ రాజ్యం లేకపోతే తెలంగాణ ప్రజలంతా అడుక్కుతినట్లే అని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కెసిఆర్ ఫ్యామిలీ అడుక్కుతినేదని అన్నారు. కెసిఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్సే అని అన్నారు. కాంగ్రెస్ బలపరిచితేనే సిద్దిపేటలో సింగిల్ విండో డైరెక్టర్ అయ్యారని అన్నారు. ఆనాడు కేసీఆర్ ను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింది ఇందిరమ్మ కుమారుడు సంజయ్ గాంధి అని గుర్తు చేశారు. మారుమూల తండాలో లంబాడీలకు నిలువునీడనిచ్చింది ఇందిరమ్మ రాజ్యమే అన్నారు. పోడు భూములకు పట్టాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంలోని జరిగేవని అన్నారు. తెలంగాణలో రాచరిక పాలన కొనసాగుతుందని ఇక కెసిఆర్ పాలనకు కాలం చెల్లిందని కెసిఆర్ ను ఇంటికి పంపించే సమయం వచ్చిందని అన్నారు. చివరిగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

 

Views: 167
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.