బీ ఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన యూత్ కార్యకర్తలు

యూత్ ప్రెసిడెంట్ దేవల్ల వెంకటేష్ ఆధ్వర్యంలో

On
బీ ఆర్ ఎస్ ను వీడి  కాంగ్రెస్ లో చేరిన యూత్ కార్యకర్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా మోటా కొండూర్ మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామం నుంచి బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు దేవల్ల వెంకటేష్ ఆధ్వర్యంలో యూత్ కార్యకర్తలు అంతా టిఆర్ఎస్ ను వీడి బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కరోనాకాలం నుంచి బీర్ల ఐలయ్య చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ముత్తిరెడ్డిగూడెం గ్రామ టిఆర్ఎస్ యూత్ కార్యకర్తలంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దేవల్ల వెంకటేష్ మాట్లాడుతూ అభివృద్ధి చేసే నాయకుడికి ఓటు వేయాలని, బీఆర్ఎస్ లో తగిన గుర్తింపు లేనందున తాను బీ ఆర్ ఎస్ వీడుతున్నట్టు తెలియజేశారు. ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి కోసం చేయి గుర్తుకు ఓటు వేసి బీర్ల ఐలయ్యను గెలిపించాలని వారన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు పంతుల రాంబాబు, పంతుల వెంకటేశ్వర్లు, దేవరాజు గౌతమ్, ఆడెపు సోములు, అన్న బోయిన కనకయ్య, గడ్డం జహంగీర్, దేవరాజు పోచయ్య దేవరాజు సతీష్ ,మేస్త్రి యాదయ్య, తదితరులు చేరారు.

Screenshot_20231121_115017~2
కండువా కప్పుతున్న బీర్ల ఐలయ్య
Views: 30

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
విలేకరుల సమావేశంలో డిఎస్పి ఆదినారాయణ
27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి 
వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక