బిఆర్ఎస్ పాలనలో నీళ్లు, నిధులు,నియామకాలు, ఎమి చేయలేదు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

కట్టంగూర్ రోడ్ షో లో భారీ ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు

On
బిఆర్ఎస్ పాలనలో నీళ్లు, నిధులు,నియామకాలు, ఎమి చేయలేదు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 22 (నల్లగొండ జిల్లా ప్రతినిధి):- కట్టంగూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం,మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. అనంతరం వేముల వీరేశం మీడియా ముఖంగా మాట్లాడుతూ ... కట్టంగూరు మండల హెడ్ క్వార్టర్ నుండి వేలాదిమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు భారీగా రోడ్ షో లో పాల్గొనడం జరిగింది. ప్రజలు టిఆర్ఎస్ పార్టీ పైన పాలన పైన తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. అప్పుడు ఇచ్చిన హామీలు అన్ని ఉత్త మాటలు అయిపోయినాయి అని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతది ,ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పారు. నకిరేకల్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతున్నానని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ఆశ్వీరాదం తీసుకోవడానికి మీ వద్దకు రావడం జరిగింది.ఈ ఎన్నికలు ధర్మం అధర్మం మధ్య జరుగుతున్న ఎన్నికలు,కెసిఆర్ గారు బిఆర్ఎస్ పార్టీని నడుపాటేడ్లు ఒక్క బిజినెస్ నడుపుతుండు,ఈ రాష్టంలో కెసిఆర్ ఆహంకరం పాలన పోవాలి.బిఆర్ఎస్ పాలనలో నీళ్లు, నిధులు,నియామకాలు, ఎమి చేయలేదు.తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడుతాయిఅన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే - ఇచ్చిన తెలంగాణను అప్పుల పాలు చేశారు.అభివృద్ధి కోసమే పార్టీ మరిన వ్యక్తి - అయిటిపాముల లిఫ్ట్ ఎందుకు ప్రారంభించలేదు.కెసిఆర్ ఉద్యోగం పోతనే - మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి.కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 06 గ్యారంటీ స్కీమ్ లను ప్రతి లబ్ధిదారులకు అందిస్తాం.నవంబర్ 30 నాడు జరిగే ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ, తప్పకుండా మీ గ్రామాని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే భాద్యత నాది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ద సుక్కయ్య మాజీ జెడ్పిటిసి మాద యాదగిరి, సుంకరబోయిన నరసింహ, పూజర్ల షంబయ్య, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

Views: 16

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.