టీఎన్జీవో నూతన జిల్లా కార్యవర్గ సమావేశం
సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా టీఎన్జీవో నూతన కార్యవర్గం ఏర్పడినందున సంగారెడ్డి పట్టణంలో టీఎన్జీవో భవన్లో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరియు ఈ సమావేశం టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు MD జావిద్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ హాజరయ్యారు . మారం జగదీశ్వర్ సమావేశాని ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలని పరిష్కరించడానికి తాను అన్ని విధాలుగా సంఘం తరఫున కృషి చేస్తానని చెప్పారు. అదేవిధంగా ఉద్యోగస్తులందరూ పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లా అధ్యక్షులు MD జావేద్ అలీ మరియు ప్రధాన కార్యదర్శి రవి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పైన నిరంతరం పోరాడుతామని అదేవిధంగా ఉద్యోగులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అసోసియేట్ అధ్యక్షులు కాసిని శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ మరియు అన్ని తాలుకల అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు మరియు వివిధ ఫోరమ్ ల అధ్యక్ష కార్యదర్శులు, వారి కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comment List