పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారం...

బిఆర్ఎస్ జనగామ అసెంబ్లీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించడమే లక్ష్యం... గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న గులాబీ దళాలు... ప్రభుత్వం చేపట్టిన పథకాలను గడపగడపకూ వివరిస్తూ ప్రచారం.. ప్రపంచ దేశాలకే తెలంగాణ ఆదర్శం...

On
పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారం...

ప్రపంచ దేశాలకే తెలంగాణ ఆదర్శం...

నవంబర్ 27 ,న్యూస్ ఇండియా తెలుగు (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

IMG-20231127-WA1103

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ బిఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గడప గడపకు నమునా బ్యాలెట్ తో విసృత ప్రచారం నిర్వహించారు.గడిచిన తొమ్మిదేళ్ళ ప్రభుత్వ పాలనలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వెల్లడించారు. కేసిఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలు అమలు చేసారని గుర్తు చేశారు.ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆరోగ్యలక్ష్మీ, కెసిఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, కంటి వెలుగు వంటి పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. ప్రపంచ దేశాలకే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. బిఆర్ఎస్ సర్కార్ పింఛన్లను పెంచిందని, సౌభాగ్య లక్ష్మీ కింద మహిళలకు మూడు వేలు ఇవ్వనున్నట్లు, గ్యాస్ ధరను 400 కు ఇవ్వనున్నట్లు ,రేషన్ కార్డు ఉన్నవారికి సన్న బియ్యం ఇవ్వనున్నట్లు ,కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ కేసీఆర్ సర్కార్ను తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

IMG-20231127-WA1033

Read More మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..

Views: 393
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:- తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువ రైతు మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా శనివారం ఉదయం...
సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం