ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన

కొత్తగూడెం ప్రశాంతి నగర్ నాగుల్ మీరా దర్గా లో ప్రార్థనలు

On

ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన

 

 భద్రాద్రి కొత్తగూడెం న్యూస్ ఇండియా బ్యూరో (కోలకాని నరేష్)నంబరు 28 : రాజ్య సభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కొత్తగూడెం ప్రశాంతినగర్ వద్ద నెలకొన్న నాగుల్ మీరా దర్గాను సందర్శించారు.కార్తీక పున్నమి సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.బ్యాండ్ మేళాలు కోయ నృత్యాలు,పకీరుల విన్యాసాల మధ్య గుర్రాల రథంపై దేవుని నిషాణీలను ఎంపీ రవిచంద్ర భక్తి శ్రద్ధలతో చేతబట్టుకుని దర్గాలో ప్రతిష్ఠించి ప్రార్థనలో పాల్గొన్నారు.ఈ ఉత్సవాలకు పట్టణ ప్రముఖులు కంచర్ల చంద్రశేఖర్ రావు, భీమా శ్రీధర్,తొగరు రాజశేఖర్, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

Views: 9
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News