మహా నగరంలో కల్తీ మాయగాళ్ళు

అడ్డదారిలో కోట్లు దండుకునేందుకు

On
మహా నగరంలో కల్తీ మాయగాళ్ళు

పట్టు బడ్డా నకిలీ మెడిసిన్

హైదరాబాద్ మహానగరంలో మాయగాళ్లు. అడ్డదారిలో కోట్లు దండుకునేందుకు ఏకంగా క్యాన్సర్‌ మెడిసిన్‌ కల్తీ దందా మొదలుపెట్టారు. ఫార్మా కంపెనీ ముసుగులో సాగుతోన్న భారీ నకిలీ మందుల తయారీ రాకెట్‌కు డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు చెక్‌ పెట్టారు.
పక్కా నిఘా పెట్టి ఆస్ట్రికా హెల్త్‌కేర్‌ గుట్టును రట్టు చేశారు. బొల్లారంలోని ఆస్ట్రికా హెల్త్‌కేర్‌లో కంపెనీల్లో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపడితే…నకిలీ యవ్వారం బయటపడింది.
దాదాపు నాలుగున్నర కోట్ల విలువైన నకిలీ మందులను సీజ్‌ చేశారు అధికారులు. బొల్లారం సహా, కీసర, నాచారం, మేడ్చల్‌లోని అస్ట్రికా అనుబంధ కంపెనీల్లోనూ సోదాలు నిర్వహించారు.

క్యాన్సర్‌ మందులకు నకిలీలను తయారు చేసి మార్కెట్‌లో విక్రయి స్తున్నారనే సమాచారంతో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. డీజీ కమలాసన్‌ రెడ్డి ఆదేశాలతో నిఘా పెట్టారు.

పోస్టల్‌లో, కొరియర్‌లో నకిలీ మందులను సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఇన్వాయిస్‌ ఆధారంగా కూపీలాగితే అల్వాల్‌లో అడ్రస్‌ తేలింది. కానీ ఎంక్వైరీలో అది తప్పుడు అడ్రస్‌ అని గుర్తించారు. నకిలీ డ్రగ్ స్టాక్ డెలివరీ చేస్తున్న కొరియర్ బాయ్‌ని డీసీఏ అధికారులు గుర్తించారు.

అతన్ని అదుపులోకి తీసుకొని ఆరాతీస్తే..డొంక కదిలింది.సోదాల్లో నాలుగున్నర కోట్ల విలువ చేసే నకిలీ మెడిసన్‌ను సీజ్‌ చేశారు..

Read More బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..

ఆస్ట్రా జెనెరిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆస్ట్రికా హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ మీడియన్ బయోటెక్ ప్రైవేట్, అలయన్స్ బయోటెక్, సన్‌వెట్ హెల్త్‌కేర్, సాలస్ ఫార్మాస్యూటికల్స్, DM ఫార్మా ప్రైవేట్. లిమిటెడ్, సేఫ్ పేరెంటరల్స్ ప్రైవేట్. లిమిటెడ్, Bless Pharma India Pvt. లిమిటెడ్ పేరుతో లేబుల్స్‌ ఉన్న మెడిసిన్స్‌ పట్టుబడ్డాయి.IMG_20231206_151439

Views: 49
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్