ముస్లిం మైనార్టీ నాయకులకు తగిన న్యాయం చేయాలి

On
ముస్లిం మైనార్టీ నాయకులకు తగిన న్యాయం చేయాలి

ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న ముస్లిం మైనార్టీ నాయకులకు తగిన న్యాయం చేయాలి

*ముస్లిం మైనార్టీ నాయకులకు తగిన న్యాయం చేయాలి*

న్యూస్ ఇండియా తెలుగు: డిసెంబర్12

*ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న ముస్లిం మైనార్టీ నాయకులకు తగిన న్యాయం చేయాలి*

ఖమ్మం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్  ఎస్.కె అబ్బాస్ మాట్లాడుతూ ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న ముస్లిం మైనార్టీ నాయకులకు సీట్లు దక్కలేదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకు పార్టీ టికెట్లు కేటాయించారని అన్నారు . పార్టీ కోసమే పనిచేసి ఎన్నో ఎదురు దెబ్బలు తట్టుకుని , కేసులు పాలై , అవమానలు భరించి ఎంతోకాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మొహమ్మద్ జావేద్ కు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీ తరపున ఎంపీ టికెట్ కేటాయించాలని లేదా ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని కోరారు . కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిల గెలుపులో కీలకపాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు . తెలంగాణలో మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అధిష్టాన మాటలకు కట్టుబడి పార్టీ అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు . రాబోయే పార్లమెంటు (ఎంపీ) ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త వాళ్లకు కాకుండా పాత వాళ్లకు అవకాశాలు కల్పించాలని కోరారు . కాంగ్రెస్ సీనియర్ నాయకులు చోటా బాబా లాంటి వ్యక్తులకు కూడ నామినేటెడ్ పదవులు కేటాయించాలని అన్నారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనారిటీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.డి మొహమ్మద్ , ఎన్.ఎస్.యు.ఐ టౌన్ ప్రెసిడెంట్ పి యశ్వంత్ వర్ధన్ , మైనార్టీ నగర నాయకులు ఎండి మహబూబ్ , రెండోవ డివిజన్ మైనార్టీ ప్రెసిడెంట్ ఎస్ డి ఫరీద్ లు పాల్గొన్నారు.

Read More రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..

Views: 19
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 12 :జిల్లా ఎస్పీ  రోహిత్ రాజ్ ఆదేశానుసారం  యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ లో భాగంగా 1టౌన్ సీఐ కరుణాకర్...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు