ముస్లిం మైనార్టీ నాయకులకు తగిన న్యాయం చేయాలి

On
ముస్లిం మైనార్టీ నాయకులకు తగిన న్యాయం చేయాలి

ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న ముస్లిం మైనార్టీ నాయకులకు తగిన న్యాయం చేయాలి

*ముస్లిం మైనార్టీ నాయకులకు తగిన న్యాయం చేయాలి*

న్యూస్ ఇండియా తెలుగు: డిసెంబర్12

*ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న ముస్లిం మైనార్టీ నాయకులకు తగిన న్యాయం చేయాలి*

ఖమ్మం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్  ఎస్.కె అబ్బాస్ మాట్లాడుతూ ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న ముస్లిం మైనార్టీ నాయకులకు సీట్లు దక్కలేదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకు పార్టీ టికెట్లు కేటాయించారని అన్నారు . పార్టీ కోసమే పనిచేసి ఎన్నో ఎదురు దెబ్బలు తట్టుకుని , కేసులు పాలై , అవమానలు భరించి ఎంతోకాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మొహమ్మద్ జావేద్ కు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీ తరపున ఎంపీ టికెట్ కేటాయించాలని లేదా ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని కోరారు . కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిల గెలుపులో కీలకపాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు . తెలంగాణలో మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అధిష్టాన మాటలకు కట్టుబడి పార్టీ అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు . రాబోయే పార్లమెంటు (ఎంపీ) ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త వాళ్లకు కాకుండా పాత వాళ్లకు అవకాశాలు కల్పించాలని కోరారు . కాంగ్రెస్ సీనియర్ నాయకులు చోటా బాబా లాంటి వ్యక్తులకు కూడ నామినేటెడ్ పదవులు కేటాయించాలని అన్నారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనారిటీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.డి మొహమ్మద్ , ఎన్.ఎస్.యు.ఐ టౌన్ ప్రెసిడెంట్ పి యశ్వంత్ వర్ధన్ , మైనార్టీ నగర నాయకులు ఎండి మహబూబ్ , రెండోవ డివిజన్ మైనార్టీ ప్రెసిడెంట్ ఎస్ డి ఫరీద్ లు పాల్గొన్నారు.

Read More అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..

Views: 19
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
డోర్నకల్ : యువత రాజకీయాల్లోకి రావాలన్న  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు  డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో...
మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో  ఘనంగా పరాక్రమ్ దివాస్
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 
గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..
అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్