కబ్జాకు గురవుతున్న పార్కు స్థలాలు

On

కబ్జాకు గురవుతున్న పార్కు స్థలాలు – – – -:పట్టించుకోని జిహెచ్ఎంసి అధికారాలు… న్యూస్ ఇండియా తెలుగు ఆగష్టు29(ఎల్బీనగర్ రిపోర్టర్ యాదగిరి): మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ,ప్రగతి నగర్ కాలనీ ఫేస్ -2 లో కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి, కాలనీ సంక్షేమ సభ్యులతో కలిసి పాదయాత్రగా పర్యటించి పలు సమస్యలను అడిగి తెలుసుకొని, కబ్జాకు గురైన కాలనీ పార్క్ స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డివిజన్ సమస్యలను కాలనీలో మిగిలి ఉన్న […]

కబ్జాకు గురవుతున్న పార్కు స్థలాలు – – – -:పట్టించుకోని జిహెచ్ఎంసి అధికారాలు…

న్యూస్ ఇండియా తెలుగు ఆగష్టు29(ఎల్బీనగర్ రిపోర్టర్ యాదగిరి): మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ,ప్రగతి నగర్ కాలనీ ఫేస్ -2 లో కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి, కాలనీ సంక్షేమ సభ్యులతో కలిసి పాదయాత్రగా పర్యటించి పలు సమస్యలను అడిగి తెలుసుకొని, కబ్జాకు గురైన కాలనీ పార్క్ స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డివిజన్ సమస్యలను కాలనీలో మిగిలి ఉన్న భూగర్భ డ్రైనేజీ, త్రాగునీరు , సిసి రోడ్ల పనులను తొందర్లోనే ప్రారంభించి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా జిహెచ్ఎంసి అధికారులకు వివిధ కాలనీలలో పార్కు స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని ఎన్నిసార్లు మొరపెట్టినా కానీ పట్టించుకోక పోవడంతో కాలనీలో ఉన్న పార్క్ స్థలాన్ని కబ్జా చేసి బోర్ వేశారని జిహెచ్ఎంసి అధికారులపై మండిపడుతూ డివిజన్లో ఉన్న వివిధ కాలనీల పార్కు స్థలాలకు వెంటనే ప్రహరీ గోడలను నిర్మించాలని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సభ్యులు వెంకట చారీ, అంజిరెడ్డి, మోహన్, కృష్ణ, మహేందర్, ఇంద్ర, బిజెపి నాయకులు కొండల్ రెడ్డి, కడారి యాదగిరి, పవన్,పారంద సాయి, లడ్డు, నవీన్ పాల్గొన్నారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్ ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు...
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన