చేపల వేటకు వెళ్లి మత్స్యకారుని మృతి

On
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుని మృతి

Screenshot_20231226_202026~2

చేపల వేటకు వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని గోకారం గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వలిగొండ మండలంలోని గోకారం గ్రామానికి చెందిన పబ్బు శ్రీరాములు (65) చేపలు పట్టుకొని జీవనం సాగిస్తుంటాడు. రోజు మాదిరిగానే 24వ తేది ఆదివారం రోజున గ్రామంలోని మల్ల సముద్రం కుంటలో చేపలు పట్టుటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చేపలు పట్టే వల అతనికి చుట్టుకుని కుంటలో పడిపోయాడు. సాయంత్రం వరకు కూడా ఇంటికి రాకపోవడంతో 25వ తేదీ న అతని కోసం అంతటా గాలించిన ఫలితం లేకపోవడంతో 26వ తేదీన మల్ల సముద్రం కుంటలో శవమై తేలాడు. మృతునికి ఈత వచ్చిన కూడా వల చుట్టుకోవడంతో అతను మరణించాడు. మృతుని అల్లుని ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేసుకుని ఎస్సై పెండ్యాల ప్రభాకర్ దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

Views: 327
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత