చేపల వేటకు వెళ్లి మత్స్యకారుని మృతి

On
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుని మృతి

Screenshot_20231226_202026~2

చేపల వేటకు వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని గోకారం గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వలిగొండ మండలంలోని గోకారం గ్రామానికి చెందిన పబ్బు శ్రీరాములు (65) చేపలు పట్టుకొని జీవనం సాగిస్తుంటాడు. రోజు మాదిరిగానే 24వ తేది ఆదివారం రోజున గ్రామంలోని మల్ల సముద్రం కుంటలో చేపలు పట్టుటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చేపలు పట్టే వల అతనికి చుట్టుకుని కుంటలో పడిపోయాడు. సాయంత్రం వరకు కూడా ఇంటికి రాకపోవడంతో 25వ తేదీ న అతని కోసం అంతటా గాలించిన ఫలితం లేకపోవడంతో 26వ తేదీన మల్ల సముద్రం కుంటలో శవమై తేలాడు. మృతునికి ఈత వచ్చిన కూడా వల చుట్టుకోవడంతో అతను మరణించాడు. మృతుని అల్లుని ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేసుకుని ఎస్సై పెండ్యాల ప్రభాకర్ దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

Views: 332
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

బాలయ్యతో కొరటాల శివ సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన నారా లోకేష్.. రూ.200 కోట్ల పాన్ ఇండియా మూవీ! బాలయ్యతో కొరటాల శివ సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన నారా లోకేష్.. రూ.200 కోట్ల పాన్ ఇండియా మూవీ!
నటసింహం నందమూరి బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం అమరావతిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మంత్రి నారా లోకేష్ తొలి...
ప్రియుడి కోసం కాబోయే మొగుడ్ని బలిచ్చిన అందాల రాక్షసి.. లోహగడ్ కోటపై పక్కా మర్డర్ స్కెచ్!
రూ.400 కే హైదరాబాద్ TO గోవా టూర్.. ఫుల్ డిటైల్స్ మీ కోసం..!
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో ఏం చూడాలో తెలుసా?
ఒకే టిక్కెట్‌తో 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ దర్శనం.. భక్తులకు IRCTC బంపర్ ఆఫర్!
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్‌ ఏంటో తెలుసా?
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయి?