పాయకరావుపేటలో కంబాల జోగులును మార్చాల్సిందేనంటూ నాయకుల తీర్మానం

లేకుంటే సహకరించలేమంటూ వార్నింగ్

On
పాయకరావుపేటలో కంబాల జోగులును మార్చాల్సిందేనంటూ నాయకుల తీర్మానం

పునరాలోచనలో వైసీపీ హై కమాండ్?

వైసీపీలో భగ్గుమన్న అసంతృప్తి
 పాయకరావుపేట వైసీపీలో నిప్పు రాజుకుంది.  నియోజకవర్గ సమన్వయకర్తగా కంబాల జోగులును ప్రకటించడంతో స్థానిక నాయకత్వం భగ్గుమంది. లోకల్ వారికి కాకుండా బయటి జిల్లా వ్యక్తులకు ఎలా బాధ్యతలు ఇస్తారంటూ ఎక్కడిక్కడ గ్రామాల్లో వైసీపీ కేడర్ ప్రశ్నిస్తోంది.  నాన్ లోకల్ వ్యక్తికి బాధ్యతలు అప్పగించి.. పార్టీని గెలిపించమంటే ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో కనీసం పార్టీ హైకమాండ్ కు ఒక్కరంటే ఒక్కరు కూడా కార్యకర్త దొరకలేదా అని నిలదీస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఇంఛార్జి మంత్రికి తమ ఆవేదన చెప్పుకున్న నాయకులు.. ఇప్పుడు అవసరం అయితే.. జగన్ దగ్గరకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 

బయటి వ్యక్తులకు బాధ్యతలు ఇచ్చి పార్టీని భూ స్థాపితం చేస్తారా?

నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల్ని, ముఖ్య నాయకుల మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోకుండా హైకమాండ్ ఎలా నిర్ణయం తీసుకుంటుందని నియోజకవర్గంలో వైసీపీ కేడర్ అడుగుతోంది. ఇప్పటికైనా తమ నిర్ణయం వెనక్కి తీసుకోని స్థానిక నాయకురాలు, ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీకి కేటాయించాలని లేకుండా మూకుమ్మడి రాజీనామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

 వైసీపీ బలహీన అభ్యర్ధి అంటూ టీడీపీ నాయకుల్లో జోష్..
వైసీపీలో నేతల అసంతృప్తి జ్వాలల్ని తెలుగు దేశం పార్టీ క్యాష్ చేసుకుంటోంది. కంబాల జోగులు అభ్యర్ధి అయితే తమ విజయం నల్లేరు మీద నడకలాంటిదేనంటూ ముందస్తు సంబరాలు చేసుకుంటున్నారు
.........

Read More మన్నేపల్లి వారి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి ఇన్చార్జి దద్దాల

స్థానిక వ్యతిరేకత నేపథ్యంలో  ఎమ్మెల్యే అభ్యర్ధి మార్పు వైసీపీలో గందరగోళం పరిస్థితిని తీసుకువచ్చింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ కేడర్ అంతా అయోమయంలో ఉంది. స్థానికుడు కానీ వ్యక్తిని పార్టీ అభ్యర్ధిగా ప్రకటించడంతో.. అసలు కంబాల జోగులు ఎవరో తమకు తెలియదని.. స్థానికులకు ఇస్తే ఈజీగా గెలిచే సీటును.. అనవసరంగా నాన్ లోకల్ వ్యక్తికి ఇచ్చి.. వైసీపీని బలహీనం చేశారనే గందరగోళంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. అసలే వర్గ పోరుతో  ఇబ్బంది పడుతున్న పార్టీ.. ఇప్పుడు నాన్ లోకల్ అభ్యర్ధి తో మరింత బలహీనమైపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా లోకల్ మహిళా అభ్యర్ధిని ప్రకటిస్తే.. పార్టీకి బలం చేకూరుతుందని.. లేకపోతే పార్టీకి పాయకరావుపేట నియోజకవర్గంలో భవిష్యత్గు లేకుండా పోతుందనే టాక్ వినపడుతోంది.kambala jogulu1

Views: 214
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*