నల్లగొండ జిల్లా,శాలిగౌరారం మండలం,ఊట్కూరు గ్రామంలో అక్రమంగా సెల్ టవర్ నిర్మాణం పట్టించుకోని అధికారులు.

సెల్ టవర్ ముందు గ్రామస్తులు నిరసన ప్రదర్శన

On
నల్లగొండ జిల్లా,శాలిగౌరారం మండలం,ఊట్కూరు గ్రామంలో అక్రమంగా సెల్ టవర్ నిర్మాణం పట్టించుకోని అధికారులు.

న్యూస్ ఇండియా తెలుగు,జనవరి21 (నల్లగొండ జిల్లా ప్రతినిధి):ఊట్కూరు గ్రామంలో అక్రమంగా నిర్మిస్తున్న సెల్ టవర్ ని గ్రామస్తులు అడ్డుకున్నారు. సెల్ టవర్ ముందు నిరసన ప్రదర్శన చేస్తూ సెల్ టవర్ ను గ్రామం నడిబొడ్డున వేయడం వల్ల గర్భిణీలకు మరియు పిల్లలకి ముసలి వాళ్లకి జంతువులకి టవర్ నుండి వచ్చే ఎక్కువ రేడియేషన్ వల్ల చర్మ సమస్యలు, క్యాన్సర్,బ్రెయిన్ ట్యూమర్,తలనొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలు తలతుతాయని గ్రామస్తులు తెలియజేస్తున్నారు.గతంలో జియో టవర్ కూడా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించారు. ఇప్పుడు కూడా అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. దీనిని వెంటనే నిలిపివేసి గ్రామానికి ఎంత అయితే డిస్టెన్స్ లో ఉండాలో అంతో దూరంలో వేయాలని గ్రామస్తులు అంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఇటువంటి స్పందన రాలేదని, ఇది లాగానే ఉంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని గ్రామస్తులు అధికారులపై మండిపడ్డారు.

Views: 52

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News