శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరైనారు
న్యూస్ ఇండియా తెలుగు ,జనవరి 23 (నల్గొండ జిల్లా ప్రతినిధి): రామన్నపేటలోని శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి కళ్యాణానికి ముఖ్యఅతిథిగా స్థానిక నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరైనారు వారికి బెక్కం నిఖిల్ స్వామి సాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా నిఖిల్ స్వామి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఎల్లవేళలా సుఖశాంతులతో విరాజిల్లాలని దేవుని కోరారు.ఇలాంటి మహోత్సవాలు గత ఐదు సంవత్సరాల నుండి వరుసగా చేస్తున్నాను అని అన్నారు. ప్రతి మహోత్సవానికి 4000 నుండి 5000 మంది హాజరైతున్నారు. మునుముందు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. కళ్యాణం అయిపోయినాక అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాం అని తెలియజేశారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List